ప్రపంచ మార్కెట్లుకు థీటుగా పోటీపడుతూ ముందుకు సాగుతున్న క్రమంలో.. ఆర్థిక ద్రవ్యోల్భణం స్థిరంగా వున్న కారణం చేత భారతీయ రిజర్వు బ్యాంకు ఇటీవల ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షించిన తరువాత రెపో, రివర్స్ రెపో రేటుపై పావుశాతం కోతలను విధించడాన్ని మదుపరులు స్వాగతించలేదు. మార్కెట్ విశ్లేషకుల అంచనాలకు మేరకు రమారమిగా అర్బీఐ తీసుకున్న నిర్ణయం మార్కెట్లపై మాత్రం సానుకూల ప్రభావాన్ని చూపలేకపోయింది. అయితే ఈ ప్రకటన వెలువడగానే వ్యతిరేక ప్రభావం మాత్రం మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో భారీ నష్టాలను చవిచూశాయి.
దీనికి తోడు ఆసియా మార్కెట్ల ప్రతికూల ప్రభావం కూడా మార్కెట్ సెంటిమెంటుకు తోడవడంతో భారీ నష్టాలను ఎదుర్కోన్నాయి. ఉదయం ఆరంభ ట్రేడింగ్ నుంచే దేశీయ సూచీలు నేలచూపులు చూశాయి. ఈ నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడం కూడా మార్కెట్లను నష్టాల్లోకి పయనింపజేసింది. నిన్నటి సెషన్ లో 97 పాయింట్ల మేర నష్టాపోయిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా రెండు వందల పాయింట్ల మేర నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా నష్టాలను చవిచూసి 10 వేల మార్కు వద్ద ఊగిసలాడింది.
మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 239 పాయింట్లు నష్టపోగా, అటు విస్తారమైన మిడ్ క్యాప్ సూచీ కూడా సరికోత్త మైలు రాయిని తాకింది. గతంలో ఎన్నడూ తాకని ఉన్నత శిఖరాలను తాకింది. సెన్సెక్స్ లో మిడ్ క్యాప్ సూచీ 18 వేల 21 వేల పాయింట్లను నష్టపోయి 32, 237 పాయింట్ల వద్ద స్థిరపడగా, ఇటు నిఫ్టీ కూడా 68 పాయింట్లను కోల్పోయి 10వేల 13 పాయింట్ల వద్దకు జారుకుంది. ఈ క్రమంలో ఏసీసీ, అంబుజా సిమెంట్స్, భారతీ ఎయిర్ టెల్, భారతీ ఇన్ ఫ్రాటెల్, అరబిందో ఫార్మా సంస్థల షేర్లు లాభాలను అర్జించగా, లుపిన్, కోల్ ఇండియా, హిండాల్కో, బ్యాంక్ అఫ్ బరోడా, టాటా మెటార్స్(డి) సంస్థల షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more