Profit booking in banks drags markets లాభాలకు మొగ్గుచూపిన మదుపురులు.. నష్టాల్లో మార్కెట్లకు

Profit booking in banks drags sensex 239 pts nifty manages to hold 10 000

BSE, NSE, Black Money, Indian Stocks, Sensex, sensex bse, sensex today, sensex today india, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, sensex graph, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets

The market extended losses for the second consecutive session Thursday, with the Sensex shedding 282 points intraday on continued profit booking in banking & financials post RBI policy.

లాభాలకు మొగ్గుచూపిన మదుపురులు.. నష్టాల్లో మార్కెట్లకు

Posted: 08/03/2017 06:06 PM IST
Profit booking in banks drags sensex 239 pts nifty manages to hold 10 000

ప్రపంచ మార్కెట్లుకు థీటుగా పోటీపడుతూ ముందుకు సాగుతున్న క్రమంలో.. ఆర్థిక ద్రవ్యోల్భణం స్థిరంగా వున్న కారణం చేత భారతీయ రిజర్వు బ్యాంకు ఇటీవల ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షించిన తరువాత రెపో, రివర్స్ రెపో రేటుపై పావుశాతం కోతలను విధించడాన్ని మదుపరులు స్వాగతించలేదు. మార్కెట్ విశ్లేషకుల అంచనాలకు మేరకు రమారమిగా అర్బీఐ తీసుకున్న నిర్ణయం మార్కెట్లపై మాత్రం సానుకూల ప్రభావాన్ని చూపలేకపోయింది. అయితే ఈ ప్రకటన వెలువడగానే వ్యతిరేక ప్రభావం మాత్రం మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో భారీ నష్టాలను చవిచూశాయి.

దీనికి తోడు ఆసియా మార్కెట్ల ప్రతికూల ప్రభావం కూడా మార్కెట్ సెంటిమెంటుకు తోడవడంతో భారీ నష్టాలను ఎదుర్కోన్నాయి. ఉదయం ఆరంభ ట్రేడింగ్ నుంచే దేశీయ సూచీలు నేలచూపులు చూశాయి. ఈ నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడం కూడా మార్కెట్లను నష్టాల్లోకి పయనింపజేసింది. నిన్నటి సెషన్ లో 97 పాయింట్ల మేర నష్టాపోయిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా రెండు వందల పాయింట్ల మేర నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా నష్టాలను చవిచూసి 10 వేల మార్కు వద్ద ఊగిసలాడింది.

మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 239 పాయింట్లు నష్టపోగా, అటు విస్తారమైన మిడ్ క్యాప్ సూచీ కూడా సరికోత్త మైలు రాయిని తాకింది. గతంలో ఎన్నడూ తాకని ఉన్నత శిఖరాలను తాకింది. సెన్సెక్స్ లో మిడ్ క్యాప్ సూచీ 18 వేల 21 వేల పాయింట్లను నష్టపోయి 32, 237 పాయింట్ల వద్ద స్థిరపడగా, ఇటు నిఫ్టీ కూడా 68 పాయింట్లను కోల్పోయి 10వేల 13 పాయింట్ల వద్దకు జారుకుంది. ఈ క్రమంలో ఏసీసీ, అంబుజా సిమెంట్స్, భారతీ ఎయిర్ టెల్, భారతీ ఇన్ ఫ్రాటెల్, అరబిందో ఫార్మా సంస్థల షేర్లు లాభాలను అర్జించగా, లుపిన్, కోల్ ఇండియా, హిండాల్కో, బ్యాంక్ అఫ్ బరోడా, టాటా మెటార్స్(డి) సంస్థల షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  nse  bse  stock market  global markets  business  

Other Articles