ప్రభుత్వ విమానయాస సంస్థ ఎయిరిండియా కూడా చౌరధర పోటీలలోకి అడుగుపెట్టింది. దేశీయ విమానయాన మార్గల్లో ఎంపిక చేసిన రూట్లలో రాజధాని రైలు ధరల్లోనే విమానయాన అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించి. ఒక్కసారిగా విమానటికెట్ల ధరలను తగ్గించింది. రిపబ్లిక్ డే ఆఫర్ కింద అత్యంత చౌక ధరలకే విమానటికెట్లను అందిస్తామని ఊరిస్తోంది. రాజధాని ఎక్స్ప్రెస్లో ఏసీ టూటైర్ టికెట్ల ధరలకు స్వదేశీ రూట్లలో ఎకానమీ క్లాస్ టికెట్లు ఇవ్వబోతోంది. ఈ ఆఫర్ కింద జనవరి 26 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ప్రయాణాలు చేయొచ్చు. ఏప్రిల్ పదో తేదీ వరకు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే, ప్రయాణానికి కనీసం 20 రోజుల ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాలి.
ఇందులో అత్యల్పంగా ఢిల్లీ-జమ్ము మార్గంలో రూ. 1610కే టికెట్ అందుబాటులో ఉంది. ఢిల్లీ-ముంబై మార్గంలో రూ. 2401, ఢిల్లీ-బెంగళూరు మార్గంలో రూ. 2952, ఢిల్లీ-చెన్నై మార్గంలోరూ. 3100 చొప్పున టికెట్ల ధరలను నిర్ణయించారు. అయితే ఈ పథకం కింద ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయో మాత్రం ఎయిరిండియా వెల్లడించలేదు. పరిమితంగానే సీట్లున్నాయని, అందువల్ల ముందు వచ్చినవారికి ముందు ప్రాతిపదికన వాటిని కేటాయిస్తామని మాత్రం తెలిపింది. రైలు టికెట్ ధరతోనే, అంతకంటే తక్కువ సమయంలో గమ్యస్థానాలు చేరుకోవచ్చని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. కాగా ప్రత్యర్థి విమానయాన సంస్థలు గో ఎయిర్, ఇండి గో, ఎయిర్ ఏషియా, జెట్ ఎయిర్వేస్ లాంటివి ఇప్పటికే ఆఫర్లతో వెల్లువెత్తిస్తున్నాయి. లేటుగా వచ్చినా ఎయిరిండియా విభిన్నమైన ఆఫర్ ప్రకటించడంతో ప్రయాణికులను ఆకట్టుకోవచ్చని భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more