దేశ పారిశ్రామిక రంగంతో పాటు ఇటు దేశీయ మార్కెట్లను ఒక కుదుపు కుదిపిన టాటా గ్రూప్ తాజా వ్యవహారం దేశీయ సూచీలపై ప్రభావం చూపింది. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సరస్ మిస్త్రీను తొలగించడంతో టాటా గ్రూప్ షేర్లపై ఆ ప్రభావం పడింది. ఈ ప్రభావంతో ఇవాళ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదోడుకులకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఉదయం మార్కెట్లు ప్రారంభంతోనే నిఫ్టీ 20 పాయింట్ల నష్టపోగా, సెన్సెక్స్ మాత్రం వందపాయింట్లకుపైగా నష్టపోయింది. అయితే మార్కెట్లు ముగింపులో మాత్రం సెన్సెక్స్ 88 పాయింట్ల నష్టంతో ముగియగా, నిఫ్టీ కూడా నష్టాలబాట పట్టింది
ముగింపు సమయానికి 88 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 28091 పాయింట్ల వద్ద ముగియగా.. నిఫ్టీ కూడా 18 పాయింట్ల నష్టంతో 8,691 పాయింట్ల వద్ద చేరి మరోమారు కీలకమైన 8700 మార్కుకు దిగువకు చేరింది. టాటా గ్రూప్ సంస్థలున్న అన్ని సూచీలు రమారమి నష్టాలలోనే పయనించాయి. టాటా మోటార్స్ సూచీతో అటో రంగం, క్యాపిటల్ గూడ్స్, ఎంఎంజీసీ, ఐటీ, టెక్నాలజీ మిడ్ క్యాప్ సహా అయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ సూచీలు నష్టాలలోనే పయనించాయి. కాగా బ్యాంకింగ్, బ్యాంకింగ్ అటో, కన్జూమర్ డూరబుల్స్, హెల్త్ కేర్, చిన్న తరహా సమాఖ్యాలు మాత్రమే స్వల్ప లాభాలను అర్జించాయి.
ఈ క్రమంలో అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, భారతి ఇన్ఫ్రాటెల్, భారతి ఎయిర్ టెల్, ఐసిఐసిఐ బ్యాంకు తదితర సంస్థల షేర్లు అధ్యధిక లాభాలను అర్జించగా, మహింద్రా అండ్ మహింద్రా, టాటా స్టీల్, గెయిల్, ఐడియా సెల్యూలార్, హెచ్ యు ఎల్, తదితర సంస్థల షేర్లు అధిక నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇదిలావుండగా, టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తనను ఉన్న పళంగా తొలగించడంపై వస్తున్న పుకార్లను సైరస్ మిస్త్రీ కొట్టిపారేశారు. గత 24 గంటలుగా జరిగిన తతంగమంతా ఆశ్చర్యకరమైనది కానప్పటికీ, చాలా సెన్సిటివ్ అని మాత్రం మిస్త్రీ పేర్కొన్నారు.
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అగౌరవమైన రీతిలో మిస్త్రీని తొలగించడంపై బోర్డు నిర్ణయంపై పల్లోంజి గ్రూప్, మిస్త్రీ కోర్టులో సవాలుచేయనున్నట్టు పలు టీవీ చానెల్స్ రిపోర్టు చేశాయి. ఈ మధ్యాహ్నం లోపు ఆయన బొంబాయి హైకోర్టు ఆశ్రయించనున్నట్టు పేర్కొన్నాయి. కానీ వ్యాజ్యాన్ని దాఖలు చేయడానికి పబ్లిక్ ప్రకటన తప్పనిసరి అని షాపూర్జీ పల్లోంజి గ్రూప్, మిస్త్రీ పేర్కొన్నారు. షాపూర్జీ గ్రూప్ కానీ, సైరస్ మిస్త్రీ గ్రూప్ కానీ ఇప్పటివరకు కోర్టుకు వెళ్తున్నట్టు ఎలాంటి ప్రకటన చేయలేదు.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more