కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ సామ్సంగ్ మరో అవిష్కరణకు ముహూర్తాన్ని ఖరారు చేసుకుంది. భారతీయ విఫణిలోకి మరో ఉత్పత్తిని ప్రవేశపెట్టనుంది. దీనికి బుధవారాన్ని ముహూర్తంగా పెట్టుకుంది. ఈ మేరకు మీడియా ప్రతినిధులకు అహ్వానాలను పంపింది. తొలిసారిగా భారత దేశంలో తయారు చేసిన ఉత్పత్తిని రేపు సంస్థ ప్రతినిధులు అవిష్కరించనున్నారు. ఆ ఉత్పత్తే సామ్సంగ్ నూతన అవిష్కరణ ఈ టాబ్లెట్. మొబైల్ అమ్మకాల్లో రారాజుగా వెలుగొందుతున్న సామ్సంగ్ ఇండియా ఓ సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్ను మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. మే 25న దీన్ని లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది.
సామ్ సంగ్ ట్యాబ్ ప్రత్యేకతలివే:
7 అంగుళాల డిస్ప్లే, విత్ 1280, 800 పిక్చర్ రిజల్యూషన్
1.3 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
1.5జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ కనెక్టివిటీ
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more