Sensex ends below 24K for 1st time since May 2014, down 100 points

Weak global cues push back sensex nifty

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

The sell-off in equity benchmarks continued for second consecutive session with the Sensex closing below psychological 24000-mark for first time since May 15, 2014.

పతనం అంచున సూచీలు.. 24 వేల మార్కుకు దిగువన సెన్సెక్స్

Posted: 01/21/2016 04:46 PM IST
Weak global cues push back sensex nifty

విదేశాల నుంచి వచ్చిన వ్యతిరేక పవనాలు దేశీయ స్టాక్ మార్కెట్లను పతనం అంచున పయనం సాగించేట్లుగా చేశాయి. నిన్నటి బ్లడ్ షడ్ తరువాత కొలుకుంటుందని ఆశించిన మార్కట్లకు అసియా మార్కెట్ల ప్రతికూల పవనాలు దెబ్బతీశాయి. దీంతో 2014 మే 15 నాటి కనిష్టస్థాయికి మార్కెట్లు చేరుకున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికార పగ్గాలను చేపట్టని నాటికి మార్కెట్లు చేరుకున్నాయి. ఈ తరుణంలో భారత్ భవిష్యత్ లో మెరుస్తుందన్న ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కామెంట్లపై కూడా వార్తలు వినబడుతున్నాయి..

అసియా మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలకు తోడు క్రూడ్ అయిత్ ధరల పతనం కూడా మార్కెట్ల కుదుపుకు కారణమైంది. దీంతో మదుపరులు అమ్మకాల మొగ్గుచూపడంతో దేశీయ సూచీలు నష్టాలబాటలో పయనించాయి. ఉదయం మార్కెల్లు ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు నష్టాలతో కొనసాగాయి. మార్కెట్లు ముగిసే సమయానికి వంద పాయింట్ల నష్టంతో 23 వేల 962 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ కూడా 33 పాయింట్ల నష్టంతో 7, 279 పాయింట్ల వద్ద ముగిసింది.

ఈ క్రమంలో బీఎస్సీ బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీలకు చెందిన సూచీలు అధిక లాభాలను గడించగా, కన్జూమర్ డ్యూరబుల్స్, బిఎస్సీ ఐటీ, బిఎస్సీ టెక్నాలజీ, చిన్న తరహా పరిశ్రమల సూచీలు స్వల్పంగా లాభాలను ఆర్జించాయి. కాగా అటో, హెల్త్ కేర్, అయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ ఎం జీ సీకి చెందిన సూచీలు అత్యంతంగా పతనం కాగా, మెటల్స్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, మద్య తరహ పరిశ్రమల సూచీలు నష్టాలను చవిచూశాయి. ఈ నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, అంబుజా సిమెంట్స్, బ్యాంక్ అఫ్ బరోడా, టాటా స్టీల్ తదితర సంస్థల షేర్లు అత్యధిక లాభాలను అర్జించగా, మారుతి సుజుకీ, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, కోల్ ఇండియా, ఐడియా సెల్యూలార్ తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Gold and silver  indian rupee  RBI  

Other Articles