Indian markets post biggest weekly gain since June

Sensex jumps 234 pts on fed minutes nifty settles at 8189

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

The BSE Sensex and NSE Nifty opened in green tracking global cues. Sensex opened 129.11 points up at 26,974.92. Nifty opened 57 points up at 8,186.35.

4 నెలల తరువాత గరిష్ట లాభాలను అందుకున్న వారం..

Posted: 10/09/2015 09:30 PM IST
Sensex jumps 234 pts on fed minutes nifty settles at 8189

విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో ఇవాళ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను ఆర్జించాయి. అగ్రరాజ్యం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రిజర్వు.. తాము కీలక వడ్డీ రేట్లను పెంచడంలో తొందరపడబోమని.. అన్ని అచితచిన తరువాతే.. కీలక వడ్డీ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని వెలువరించడంతో మార్కెట్లు లాభాలలో దూసుకెళ్లాయి. దీనికి తోడుగా ఆసియా మార్కెట్ల నుంచి వీచిన బలోపేత పవనాలు జతకట్టడంతో దేశీయస్టాక్ మార్కెట్ల లాభాలను ఆర్జించింది. నిఫ్టీ 8200 మార్కును సైతం తాకింది. అటు నిఫ్టీ కూడా 27 మారు్కను తాకింది. ఇక్క రోజు మినహా అన్ని రోజులు లాభాలలో దూసుకుపోయిన మార్కెట్లు ఈ ఏడాది జూన్ తరువాత అత్యధికంగా లభాలను అర్జించిన వారంగా ఈ వారం నమోదు చేసుకుంది.

ఉదయం మార్కెట్లు ప్రారంభంతోనే లాభాలను ఆర్జించాయి. ఒకానోక సమయంలో సెన్సెక్స్ 300 పాయింట్ల పైచిలుకు లాభాలను తాకాగా, నిఫ్టీని 85 పాయింట్ల లాభాలు తాకాయి అయితే వచ్చిన లాభాలను అధిమిపట్టుకోవడంతో కోంత ఇబ్బందులు పడ్డ సూచీలు.. ఎట్టకేలకు ముగింపు మాత్రం లాభాలతోనే పూర్తి చేశాయి. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 234 పాయింట్లు లాభాన్ని ఆర్జించి 27 మార్కును తాకింది. సెన్సెక్స్ 27, 072 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించగా, అటు నిఫ్టీ కూడా 60 పాయింట్లు లాభంతో 8,189 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది.

ఈ క్రమంలో కన్జూమర్ డ్యూరబుల్స్, అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, మద్య తరహా పరిశ్రమల సూచీలు నష్టాలలో పయినియంచగా, మిగిలిన అన్ని సూచీలు లాభాలను అర్జించాయి. మరీ ముఖ్యంగా ఐటీ, టెక్నాలజీ, అటో, బ్యాంకింగ్, బ్యాకింగ్ నిఫ్టీ సూచీలు భారీ లాభాలను ఆర్జించగా, మిగిలిన సూచీలు స్వల్ప లాభాలను ఆర్జించాయి. ఈ నేపథ్యంలో వేదంతా, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఇన్పోసిప్, ఐసిఐసిఐ బ్యాంక్ తదితర సంస్థలు లాభాలను ఆర్జించగా, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, మారుతి సుజుకీ, సన్ ఫార్మ తదితర సంస్థల షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Gold and silver  indian rupee  RBI  

Other Articles