దేశంలో వున్న అందమైన ప్రదేశాల్లో తలకోన జలపాతం ఎంతో అపురూపమైంది. చుట్టూ ఎత్తైన కొండలు.. దట్టమైన అరణ్యప్రాంతం.. మధ్యలో వుండే ఈ జలపాతం ప్రకృతి ప్రతిరూపంగా కనువిందు చేస్తుంది. ఇంతటి రమణీయ ప్రదేశం ఎక్కడుందని ఆలోచిస్తున్నారా..? మరెక్కడో కాదు.. చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తిరుపతికి 58 కిలోమీటర్ల దూరంలోనే వుంది. ఈ ప్రాంతంలో సాక్షాత్తూ ఆదిశేషుడే పర్వతరూపం దాల్చాడని పురాణ గాథ.
పూర్వం.. కుబేరుని అప్పు తీర్చేందుకు శ్రీనివాసుడు ధనాన్ని కొలుస్తూ.. అలసిపోయి ఇక్కడే నిద్రపోయాడని చెబుతారు. అలా పడుకునే సందర్భంలో ఆయన తల భాగం ఇక్కడున్న కొండ (కోన) శిఖరం మీద ఆనించాడని.. అందుకే ఈ ప్రదేశానికి తలకోన అనే పేరు వచ్చిందని స్థలపురాణం. ఈ జలపాతాన్ని శిరోద్రోణం అని కూడా పిలుస్తారు. ఎంత రమణీయంగా కనువిందు చేసే ఈ జలపాతం.. రాష్ట్రంలోనే ఎత్తయినది పేరుగాంచింది. నిత్యం పర్యాటకులతో కళకళలాడే ఈ తలకోన ప్రాంతంలో మరెన్నో అందాలను వున్నాయి.
* తలకోన జలపాతం : కొండ అంచుల్లో దట్టమైన అడవిగుండా దాదాపు రెండు కిలోమీటర్లు దూరంలో ఈ జలపాతాన్ని చూడొచ్చు. ఈ జలపాతానికి చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండలు వుంటాయి. ఇటువంటి ప్రకృతి మధ్య బంధింపబడి వున్న ఈ జలపాతాన్ని చూసినప్పుడు ఎంతో అపురూపమైన అనుభూతి కలుగుతుంది. జలపాత దృశ్యం చూడ్డానికి చాలా అకర్షణీయంగా వుంటుంది. నల్లమల పర్వతశ్రేణుల్లో ఈ జలపాతం ఉండడం విశేషం. 60 మీటర్ల ఎత్తునుంచి ఈ జలపాతం జాలువారుతుంది.
* శివాలయం : తలకోన జలపాతం ఉన్న ప్రాంతంలోనే ఓ శివాలయం ఉంది. ఇక్కడి శివుడు సిద్ధేశ్వరుని రూపాన కొలువై ఉన్నాడు. ఈ ఆలయాన్ని 1811లో అప్పాస్వామి అనే భక్తుడు కట్టించాడని స్థానికులు చెబుతారు. శివుడితో పాటు అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు కూడా వున్నాయి.
* నెలకోన : ఆలయానికి అతి సమీపంలోనే దట్టమైన కొండల మధ్య ఓ వాగు ప్రవహిస్తూంటుంది. ఇందులోని నీరు చాల తేటగాను చాల చల్లగాను ఉంటాయి. ఇక్కడి రెండు కొండల నడుమ ఒక నీటి ప్రవాహము వచ్చి ఒక కొలనులో దూకుతూ ఉంటుంది. ఎంత ఎత్తునుంచి నీళ్లు జాలువారుతాయో కనిపించవు. ఔషధ లక్షణాలు కల మొక్కలు అనేకం ఉన్నాయి.
* వృక్ష సంపద : ఈ దట్టమైన అటవీ ప్రాంతం వృక్ష సంపద, వన వూలికలకు పుట్టినిల్లు. ఈ అడవుల్లో వృక్షాలు చాలా ఎత్తుగా ఉంటాయి. సూర్యరశ్మి నేలమీద పడనంత దట్టమైన అడవి కావడంతో చెట్లు సూర్యరశ్మిని అందుకోవడానికి పైకి పైపైకి పెరుగుతాయి. ఎక్కువగా ఎర్రచందనం, జాలారు, వుద్ది లాంటి చెట్లు ఉంటాయి. అడవిలో ప్రధానంగా అడవికోళ్లు, నెమెళ్లు, దేవాంగుపిల్లి, బెట్లుడుత, ఎలుగుబంట్లు, దుప్పులు, కణితులు, ఏనుగులు ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more