దేశంలో వెలసిన పవిత్రపుణ్యక్షేత్రాల్లో ‘గంగోత్రి’ ఒకటి. గంగాదేవి నదిరూపంలో ప్రతిష్టితమైన ఈ ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీలో వుంది. ఇది హిమాలయాల పర్వత శ్రేణులలో సముద్ర మట్టానికి 4,042 మీటర్ల ఎత్తులో వుంది. ఈ ప్రదేశం హిమాలయాల్లోని చార్ధామ్లలో ఒకటి. అక్కడ గంగానది బాగీరథి పేరుతో పిలువబడుతుంది. పూర్వం గంగాదేవిని భూమికి తీసుకోవడానికి భాగీరథుడు కారణం కాబట్టి.. ఆ పేరు వచ్చింది. గంగాదేవి భూవిలో నదిరూపంలో ప్రతిష్టితమవడానికి ఓ పురాణగాధ వుంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం...
పురాణ గాధ :
పూర్వం.. ‘సగరుడు’ అనే రాజు రాక్షస సంహారం తరువాత పాప పరిహారార్ధం ‘ఆశ్వమేధ’ యాగం చేశాడు. అప్పుడు సగరుని వైభవాన్ని చూసిన స్వర్గరాజు దేవేంద్రుడు.. సగరుడు తనపదవికి పోటీకి వస్తాడేమోనన్న భయపడతాడు. దాంతో సగరుడి యాగాన్ని ఎలాగైనా భంగం కలిగించాలని భావించి.. సగరుని అశ్వమేధ అశ్వాన్ని అపహరిస్తాడు. అనంతరం ఆ అశ్వాన్ని కపిలముని ఆశ్రమంలో కట్టి వేసి... ఏమీ తెలియనట్టుగా తిరిగి వెళ్లిపోతాడు. ఈ మొత్తం తతంగం సగరుని 60 వేల కుమారులకు తెలియదు. ఆ అశ్వాన్ని కపిలమునియే అపహరించాడని భావించి.. అశ్వరక్షణార్ధం వెంట వచ్చి కోపంతో కపిల మహాముని ఆశ్రమంలో ప్రవేశిస్తారు. తపో దీక్షలో ఉన్న కపిలమునిని భంగం కలిగిస్తారు. దీంతో తీవ్ర కోపాద్రిక్తుడైన ఆ కపిలముని.. తన తపోభంగానికి కారణమైన సగరుని కుమారులు 60వేల మందిని భస్మం చేస్తాడు.
అలా కపిల మునిచే భస్మం కావింపబడ్డ తన పిత్రుల ఊర్ధ్వ గతుల కోసం సగరుని మనుమడు అయిన భాగీరథుడు తపస్సు చేశాడు. గంగాదేవిని ప్రత్యక్షం చేసుకుంటాడు. ప్రత్యక్షం చేసుకున్న గంగాదేవిని స్వర్గంనుండి భూమికి వచ్చి తన పిత్రులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటాడు. అయితే.. గంగాదేవి తన రాకను భూమి భరించలేదని, దానిని భరించగలిగినవాడు ఒక్క సాంభశివుడేనని చెప్తుంది. అప్పుడు భాగీరథుడు.. గంగాదేవిని భూమికి తీసుకువచ్చే ప్రయత్నంలో సహకరించమని శివుణ్ణి కోరుకుంటాడు. శివుడు అందుకు అంగీకరించి గంగానదిని తన జటాఝూటాలలో బంధించి మెల్లగా భూమి మీదికి వదిలినట్లు పురాణాలు చెప్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more