The biography of sardar jamalapuram kesava rao who is hyderabad state activist in nizam dynasty | indian freedom fighters

Sardar jamalapuram kesava rao biography indian activist nizam dynasty

sardar jamalapuram kesava rao biography, sardar jamalapuram kesava rao history, jamalapuram kesava rao history, jamalapuram kesava rao life story, hyderabad state controversies, nizam dynasty, sardar jamalapuram kesava rao nizam dynasty

sardar jamalapuram kesava rao biography Indian activist nizam dynasty : The biography of sardar jamalapuram kesava rao who is hyderabad state activist in nizam dynasty.

ప్రజల మనిషిగా పేరెన్నికగన్న స్వాతంత్ర్య సమరయోధుడు

Posted: 09/04/2015 05:26 PM IST
Sardar jamalapuram kesava rao biography indian activist nizam dynasty

ప్రజల మనిషిగా పేరెన్నికగన్న అతికొద్ది రాజకీయ నాయకుల్లో సర్దార్ జమలాపురం కేశవరావు ఒకరు. తన కడుపు నిండిందా లేదా అన్నది ఆయనకు ప్రధానం కాదు.. ఎదుటివాడు తిన్నాడా లేదా అన్నది ఆయన్ను నిత్యం వేధించిన ప్రశ్న! ప్రజల మనిషిగా, ప్రజల కోసం జీవిస్తూ, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో ధైర్య సాహసాలను నూరిపోయడమే ఆయన ప్రవృత్తిగా జీవించారు. అందుకే ఆయన్ను అందరూ తెలంగాణ ‘సర్దార్’గా పిలుచుకుంటారు.

జీవిత విశేషాలు :

1908 సెప్టెంబర్ 3వ తేదీన నిజాం సంస్థానంలో తూర్పు భాగాన వున్న ఖమ్మంలో ఎర్రుపాలెంలో జమలాపురం వెంకటరామారావు, వెంకటనరసమ్మ దంపతులకు కేశవరావు జన్మించారు. ఆయన ఎర్రుపాలెంలో తన ప్రాథమిక విద్య అనంతరం, హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. నిజాం పాలనలో కొనసాగుతున్న వెట్టి చాకిరితో అష్టకష్టాలకు గురవుతున్న ప్రజలను చూసిన కేశవరావు చలించిపోయారు. అప్పటినుంచి ఆయన ప్రజలను ఆ దుర్భరమైన జీవితం నుంచి విముక్తం చేయడానికి తెలంగాణ జిల్లాల్లో కాలినడకన విస్తృతంగా పర్యటించారు.

ఆ క్రమంలోనే భారత స్వాతంత్య్రోద్యమంపట్ల, గాంధీ సిద్ధాంతాల పట్ల కేశవరావు ఆకర్షితులయ్యారు. 1923లో రాజమండ్రిలో మొదటిసారి గాంధీ ఉపన్యాసాన్ని విన్న ఆయన.. 1930లో విజయవాడలో జరిగిన సభలో గాంధీ పరిచయంతో మరింత ఉత్తేజితుడయ్యారు. ఆంధ్రపితామహుడుగా ప్రఖ్యాతిగాంచిన మాడపాటి హనుమంతరావు ప్రారంభించిన గ్రంథాలయోద్యమాన్ని తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ ప్రచారం గావించారు. వయోజన విద్యకై రాత్రి పాఠశాలలు నడపడంలో కేశవరావు ముందుండేవారు. అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని నింపడానికి ప్రత్యేక శ్రద్ధను కనపరిచేవారు. 1938లో దీపావళి సందర్భంగా ఆవిర్భవించిన తెలంగాణ స్టేట్ కాంగ్రెస్‌లో కేశవరావు ప్రముఖపాత్ర నిర్వహించారు. గోవిందరావు నానక్, జనార్దనరావు దేశాయ్, రావి నారాయణరెడ్డిలతో కలిసి నిషేధాజ్ఞలను ధిక్కరిస్తూ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 18 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారు.

1942లో కాంగ్రెస్ పిలుపు మేరకు ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని తెలంగాణలో ఊరూరా ప్రచారం చేశారు. 1947 ఆగస్టు 7న మధిరలో స్టేట్ కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్ర హం మరువలేనిది. దానికి బాధ్యుడైన ఆయన కావడంతో ప్రభుత్వం రెండు సంవత్సరాలు కారాగార శిక్ష విధించింది. నిజాం సంస్థానం భారతదేశంలో విలీనమైన తరువాత, 1952లో కేశవరావు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1953 మార్చి 29న 45 ఏళ్లకే కేశవరావు కన్నుమూశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sardar jamalapuram kesava rao  nizam dynasty  indian freedom fighters  

Other Articles