వెండితెరపై ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించి ప్రేక్షకులను అబ్బురపరిచిన తెరవెనుక మనుషుల్లో విన్సెంట్ ఒకరు! డిజిటల్ హంగులు లేని కాలంలోనూ ఈయన తన కెమెరాతో మాయాజాలాన్ని ప్రదర్శించిన మహోన్నత ఛాయగ్రాహకుడు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం అందరికీ గుర్తుండే వుంటుంది. అందులో చిరంజీవిని నిజమైన జగదేకవీరుడిగానూ, శ్రీదేవిని సౌందర్యవంతమైన అతిలోక సుందరిగానూ చూపించడంలో ఆయనకు ఆయనే సాటి! కేవలం కెమెరామెన్ గానే కాదు.. దర్శకుడిగానూ ఆయన తన ప్రతిభను నిరూపించుకోగలిగారు.
జీవిత చరిత్ర :
1928 జూన్ 14న తేదీన కేరళలోని కాలికట్ ప్రాంతానికి చెందిన అనెస్టినా- జార్జ్ దంపతులకు అజయ్ విన్సెంట్ జన్మించారు. అక్కడే కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన.. సినీరంగంపై ఎక్కువ మక్కువ వుండటంతో 1950 దశంలో మద్రాసుకు పయనమయ్యారు. పరిశ్రమలో తన ప్రతిభను నిరూపించుకోవడంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. చివరగా ఈయనకు ఓ అరుదైన అవకాశం వచ్చింది. ‘చండీరాణి’ సినిమాకు ఛాయగ్రాహకుడిగా పనిచేసే ఛాన్స్ వరించింది.
అలా ఆ విధంగా కెమెరామెన్ గా కెరీర్ ప్రారంభించిన ఆయనకు.. ఇతర చిత్రపరిశ్రమల నుంచి కూడా మరిన్ని ఆఫర్లు వచ్చిపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు మలయాళంలో 'నీలకుయిల్' తొలిచిత్రానికి కెమెరామెన్ గా ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రాన్ని ఆయన ఎంతో అద్భుతంగా తెరకెక్కించి తన టాలెంట్ ను నిరూపించుకున్నారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్లకే కెమెరామెన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విన్సెంట్.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 100కుపైగా చిత్రాలకు పని చేశారు.
అగ్రకథానాయకుల నుంచి నేటి యువ హీరోల చిత్రాలకు సైతం కెమెరామెన్ గా పనిచేసిన విన్సెంట్.. కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. మలయాళంలో ఆయన దర్శకత్వం వహించిన 'తులాభారం' చిత్రం అవార్డుల వర్షం కురిపించింది. ఆ చిత్రం ఆయనకు జాతీయ పురస్కారాన్ని అందించింది. ఈ విధంగా అన్ని భాషారంగాల్లోనూ అగ్రహీరోలతో సినిమాలు తెరకెక్కించారు. ఆయన చివరిసారిగా 1985లో వచ్చిన మాలయాళ 'పౌర్ణమి రావిల్' 3డీ చిత్రానికి దర్వకత్వం వహించారు.
తెరవెనుక వుంటూ వెండితెరపై ఎన్నో అద్భుతాలను సృష్టించిన అజయ్ విన్సెంట్.. అనారోగ్యంతో బాధపడుతూ 25-02-2015వ తేదీన చెన్నైలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. విన్సెంట్కు భార్య మాగ్రెన్ట్, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more