(Image source from: akkineni nageswara rao biography)
నాటకరంగం ద్వారా కళారంగంలోకి అడుగులు పెట్టిన అక్కినేని నాగేశ్వరరావు.. నటనలో తన ప్రతిభను నిరూపించుకుని తెలుగుసినిమా తొలినాళ్ల అగ్రనాయకులలో ఒకరుగా పేరు సంపాదించుకున్నారు. ధర్మపత్ని సినిమాతో సినీజీవితాన్ని ప్రారంభించిన ఈయన.. తెలుగు, తమిళ భాషల్లో 75 సంవత్సరాలపైగా సినిమాల్లో నటించారు. జాతీయ సినీరంగంలో ఈయన కృషి ఎనలేనిది. ఈయన చేసిన ఈ కృషికి మూడు ఫిల్మ్ ఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడిగా పురస్కారాలు అందుకున్నారు. అలాగే భారతీయ సినీరంగంలో తనదైన మార్క్ ను చాటిచెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం ఈయనకు పద్మవిభూషన్ తోపాటు జీవిత సాఫ్యల పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో పురస్కరించింది.
జీవిత చరిత్ర :
అక్కినేని నాగేశ్వరరావు కృష్ణాజిల్లా వెంకట రాఘవాపురం గ్రామంలో అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు సెప్టెంబర్ 20 1923 లో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఈయన నాటకారంగంలో కొనసాగేవారు. ఈ నేపథ్యంలోనే సినిమాల్లో నటించాలనే ఆకాంక్షతో వుండగా.. విజయవాడ విధివిశాత్తూ ప్రముఖ చిత్రనిర్మాత ఘంటసాల బలరామయ్య కంటపడ్డారు. దాంతో ఆయన అక్కినేనికి ‘‘ధర్మపత్ని’’ సినిమాలో నటించే అవకాశాన్ని కల్పించారు. ఇక అప్పటినుంచి సినీ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన.. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని 1949లో అన్నపూర్ణని వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. అక్కినేని వెంకట్, నాగార్జున, సత్యవతి, నాగ సుశీల, సరోజా.
ANR ఇప్పటి వరకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి నటించిన సినిమాలు 256! పలురకాల సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన.. నటసామ్రాట్ బిరుదును పొందారు. నటనా ప్రస్థానంలో ఎన్నో పాత్రల్లో నటించి మరెన్నో మరపురాని చిత్రాల్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు. 1953 లో దేవదాసు చిత్రంతో ప్రేమికుడిగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు.. పరభాషా చిత్రపరిశ్రమ నుండి తెలుగు చిత్రపరిశ్రమని వేరు చేసి.. మన పరిశ్రమ ఔన్నత్యాన్ని దేశ విదేశాలకు చాటిన మహా నటుడు, నిర్మాత, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత. దీంతో ఈయన అందించిన ఈ సేవలకు కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్) అందుకున్న అక్కినేని 1968 లో పద్మశ్రీ అవార్డు, 1988 లో పద్మభూషణ్, 1989 లో రఘుపతి వెంకయ్య, 1990 లో దాదా సాహెబ్ ఫాల్కే, 1996 లో NTR National అవార్డులు అందుకున్నారు.
2011లో పద్మవిభూషణ్ అందుకున్న ఏకైక వ్యక్తి, నటుడు. భారతీయ సినీ రంగంలో అక్కినేని చేసిన అత్యుత్తమ సేవలకు గాను గౌరవ పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడు. అక్కినేని ని జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది Telugu Association of North America. ఒక్క మాటలో చెప్పాలంటే.. సినీ పరిశ్రమకి అక్కినేని ఓ లెజెండ్. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ జనవరి 22 తెల్లవారు జామున 2.45 గం||లకి మృతి చెందారు.
(And get your daily news straight to your inbox)
Sep 25 | ప్రస్తుతకాలంలో వున్న నటీనటులందరూ నటనకు ఎంతవరకు ప్రాధాన్యం ఇస్తారో తెలియదు కానీ... ఇంకా సినిమారంగం రాకముందు రంగస్థల నాటకాల కాలంలో కేవలం నటనకోసమే తమ జీవితాన్ని అంకితం చేసిన ఎందరో కళాకారులు వున్నారు. ఏ... Read more
Sep 23 | ఇంకా చలనచిత్ర పరిశ్రమ రాకముందే తెలుగునాటకరంగంలో ఎందరో గొప్ప నటులు తమతమ నటన ప్రతిభతో ప్రత్యేక ప్రస్థానాలను ఏర్పరుచుకున్నవారున్నారు. అందులో మన బళ్లారి రాఘవ ఒకరు. ఈయన న్యాయవాది పట్టా పొందినప్పటికీ నాటకాలలో ప్రత్యేక... Read more
Jul 15 | తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య ప్రధాన పాత్రలతో పాటు విలన్ క్యారెక్టర్లలో లీనమై, తన ప్రతిభతో అందరినీ మైమరిపించే సినిమా నటుడు ‘‘తనికెళ్ల భరణి’’! తెలుగు భాషాభిమాని అయిన ఈయన... ఎన్నో రచనలు రచించారు.... Read more