Too serious on other religions activities in tirumala says asp swamy

Tirumala, Swamy, Tirumala ASP, other religions activities, police, paster, sudhir, laptop, seized

too serious on other religions activities in tirumala says asp swamy

శ్రీవారి కొండపై అన్యమత ప్రచారం చేస్తే కఠిన చర్యలు

Posted: 11/25/2014 09:18 PM IST
Too serious on other religions activities in tirumala says asp swamy

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానం అవరణలో కానీ, తిరుమల కోండపై గాని అన్యమత ప్రచారానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అన్యమత ప్రచారానికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ స్వామి హెచ్చరించారు. ఇవాళ తిరుమలలో ఏఎస్పీ మీడియాతో మాట్లాడుతూ...  పాస్టర్ సుధీర్కు చెందిన ల్యాప్టాప్తో పాటు సిస్టమ్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆధారాలన్నీ ఇప్పటికే కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. దాంతో సుధీర్కు కోర్టు రిమాండ్ విధించింది.   

ఇటీవల పాస్టర్ సుధీర్ తిరుమలలో అన్య ప్రచారం నిర్వహిస్తున్న కార్యక్రమం మీడియాలో హాల్చల్ చేసింది. దీంతో తిరుపతి పోలీసులు రంగంలోకి దిగి సుధీర్ను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని కోర్టులో హాజరుపర్చారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఒక హైందవుడిని మతమార్పిడి చేసేందుకు యత్నించాడు. తిరుమల కోండను వాటికన్ సిటిగా మారుస్తానని, తనకు కొంత నిధులు పంపితే చాలునని అమెరికాకు తన వీడియోలను పంపాడు. అమెరికాలోని హైందవ భక్తులు ఆ వీడియోను చూసి.. మీడియాకు సమాచారం అందించడంతో తిరుమల కోండలలో అన్యమత ప్రచారం జరుగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.  

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tirumala  Swamy  Tirumala ASP  other religions activities  police  paster  sudhir  laptop  seized  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more