Will hold talks with kcr on power and water crisis in srisailam project

kcr, telangana, power crisis, chandrababu naidu, Telangana CM, AP CM, Krishna River, Srisailam project, power generation, chinna rajappa

Will hold talks with kcr on power and water crisis in Srisailam project

శ్రీశైలం జలాలపై కేసీఆర్ తో చర్చలకు సిద్దం..

Posted: 10/25/2014 01:51 PM IST
Will hold talks with kcr on power and water crisis in srisailam project

శ్రీశైలం జలాశయంలో నీటి వినియోగంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి చినరాజప్ప తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ నిర్వాకంతో తెలంగాణలో విద్యుత్ కష్టాలొచ్చాయని వెల్లడించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై దృష్టి పెట్టడంతో సమస్యను అధిగమించామని పేర్కొన్నారు. కేసీఆర్ శ్రీశైలం నీటిపై రాజకీయం చేస్తున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు.

రైతులకు సాగు నీటి కోసం 854 అడుగుల నీటిని నిల్వ వుంచాలని కోరుతుంటే.. దానిని పెడచెవిన పెట్టి.. చంద్రబాబు హయాంలో 790 అడుగుల స్థాయిలో నీరు నిల్వ వుండేంత వరకు విద్యుత్ ఉత్పాదన చేశారని చెప్పడం అవివేకానికి నిదర్శనమన్నారు. గతంలో ఒక్క యూనిట్ లో విద్యుత్ ఉత్పాదన చేసిన తెలంగాణ.. రెండు రాష్టాల మధ్య వివాదం రాజుకోవడాన్ని అసరాగా చేసుకుని మూడు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారని.. ఇది ప్రజలకు మంచి సంకేతాన్ని ఇవ్వదని అన్నారు. ఎర్రచందనం సంరక్షణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more