Pm narendra modi to attend g 20 summit in australia nri s make arrangements for meet with modi

prime minister, narendra modi, america, australia, white House, G-20 summit, NRI, Arrangements, Brisbain, sydney, olympic park

PM narendra modi to attend G-20 summit in Australia, NRI's make arrangements for meet with Modi

ఐక్యరాజ్య సమితి తరువాత మరో శిఖరాగ్ర సదస్సుకు మోడీ..

Posted: 10/22/2014 10:15 AM IST
Pm narendra modi to attend g 20 summit in australia nri s make arrangements for meet with modi

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక సంచలనంగా మారారు. దేశంలోనే సంచలనకర శక్తిగా మారిన ఆయనకు.. విదేశాలల్లో మరింత అధిక క్రేజ్ వచ్చింది. నా దేశం బాగుండాలి, నా దేశ ప్రజలు బాగుండాలి అనే భావన కలిగిన ప్రతీ నేత కోసం ప్రజలు ఎదురుచూస్తుండడం మనం తరాలుగా చూస్తేనే వున్నాం. అమెరికా పర్యటనతో అక్కడి భారత పౌరులు ఆయనను ఎంతగా ఇష్టపడతారో.. ఆయన మాటలకు ఎంతగా మంత్ర ముగ్దులవుతారో స్పష్టమైంది. ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశానికి హాజరైన మోడీ ఎంత బిజిబిజీగా గడిపారో చూశాం. ఉపవాస దీక్ష చేస్తూనే ఆయన తన పర్యటనను కొనసాగించారు. సాక్షాత్తు అగ్రరాజ్య అధ్యక్షుడు ఒరాక్ ఒబామా అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో ఇచ్చిన విందుకు హాజరై కూడా కేవలం మంచినీళ్లనే ఆస్వాదించారంటే ఆయనలోని పటిమ గొప్పదనాన్ని తెలియజేస్తుంది.

అందుకేనేమో.. ఇప్పుడు ఆస్ట్రేలియాలోని భారతీయులు ఆయన రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.  ఆయనకు స్వాగతం పలికేందుకు ఆస్ట్రేలియాలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.. నవంబరు 15న బ్రిస్బేన్‌లో ప్రారంభంకానున్న జి-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మోడీ వచ్చే నెల 17వ తేదీన సిడ్నీలోని ప్రఖ్యాత ఒలింపిక్ పార్కులో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దీనికోసం ఆస్ట్రేలియాలోని భారత జాతీయులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prime minister  narendra modi  america  australia  white House  G-20 summit  NRI  Arrangements  Brisbain  sydney  olympic park  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more