Lot of faith in the capabilities of indians says pm narendra modi

narendra modi, india, china, faith, capabilities, indians, pm

lot of faith in the capabilities of indians says pm narendra modi

దేశ డీఎన్ఎలోనే ప్రజాస్వామ్యం వుంది..

Posted: 09/21/2014 07:08 PM IST
Lot of faith in the capabilities of indians says pm narendra modi

ప్రజాస్వామ్యం భారత దేశ డీఎన్ఎలోనే ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యదేశాలే చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. 21వ శతాబ్దంలో భారత్-చైనా సంబంధాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నట్లు తెలిపారు. భారత్-చైనాను అనుకరించాల్సిన అవసరం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భారత్ తిరిగి స్వీయంగా శక్తివంతమవుతుందన్నారు. అయితే ఇందుకు కఠినతరమైన శ్రమ కావాల్సిందేనన్నారు. చైనా మాత్రం ఒంటరిగా జీవించలేదని.. పొరుగుదేశాలతో కలిసి అడుగు వేయాల్సిందేనని మోడీ తెలిపారు. భారత్ నైపుణ్యంపై స్పష్టమైన రోడ్‌మ్యాప్ తయారు చేశామన్నారు. ఈ శకం భారత, చైనాలదేనని ఆయన అశాభావం వ్యక్తం చేశారు.

భారతీయువల శక్తి సామర్థ్యాలపై తనకు అపారమైన నమ్మకం ఉందని స్పష్టం చేశారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి అంతర్జాతీయ మీడియాకు ఇంటర్యూ ఇచ్చిన మోడీ.. బాలికల విద్య ద్వారానే మహిళల స్వాలంబన సాధ్యమవుతుందన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదుల ముస్లింలకు ప్రతినిధులు కాదని తెలిపారు. ఉగ్రవాదం అనేది మానవత్వానికి ఒక సవాలు వంటిదని మోడీ స్పష్టం చేశారు. తనకు మానవత్వంపై అపారమైన నమ్మకముందన్నారు. భారత ముస్లింలు దేశం కోసమే జీవిస్తారని, అవసరమైతే భారత్ కోసం ప్రాణాలిస్తారని తెలిపారు. ఉగ్రవాదులు ఆడమన్నట్లు భారతీయ ముస్లింలు ఆడరని ఆయన అన్నారు. ప్రపంచంలోని మనుషులదరూ ఒక్కటవ్వాలని ఆకాంక్షించారు. భారత్-అమెరికాల మధ్య చాలా సామీప్యతలున్నాయన్నారు. పుస్తకాలు తన నేస్తాలని.. తానెప్పుడూ ఏకాకని అనుకోలేదని మోడీ అన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  india  china  faith  capabilities  indians  pm  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more