Beer cost may go high

Telangana, Ap government, beer, liquor prices, beverage companies, demand, stike

government plans to hike beer price

దసరా నుండి ‘భీర్ బలు‘లకు వాయింపులే..

Posted: 09/18/2014 03:32 PM IST
Beer cost may go high

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ప్రజలకు అనేక వాగ్ధానాలు చేసి.. అధికారంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వాలు ముందస్తుగా రాష్ట్ర ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు., ఎంత ధరలు పెంచినా.. కిమ్మనకుండా మత్తలోకి జారే బీరు బలులు అందే మందుబాబుల జేబులకు చిల్లు పెట్టేందుకు ప్రభుత్వాలు ప్లాన్ చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వుండగా మద్యం ధరలను సమీక్షించిన సర్కార్..  విభజన జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు ధరను సమీక్షించలేదు. అప్పటి ధర ఇప్పుడు ఏ రాష్ట్రంలోనూ లేదని, వాటిని పున: సమీక్షించాలని బీర్ కంపెనీల యాజమాన్యాలు కోరుతున్నాయి. పాత ధర చాలా తక్కువగా వుందని, వీటితో తమకు అనేక నష్టాలు వస్తున్నాయని బెవరేజ్ కంపెనీలు అంటున్నాయి.

ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం మద్యం ధరలను పున: సమీక్షించాలని లేని పక్షంలో తాము దనరా నుంచి ఉత్పత్తిని నిలిపేస్తామని హెచ్చరిస్తున్నాయి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ఒకే బెవరేజ్ సంస్థ వుండడం, ఆ రాష్ట్రానికి కూడా బీరును తెలంగాణ నుంచే రవాణా చేయాల్సి రావడంతో పన్నుల రూపంలో భారం అధికంగా పడుతోందని బెవరేజ్ సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. ఒక్క బీరు కేసు (12 బాటిళ్ల)కు కర్ణాలక రూ.465, తమిళనాడు రూ. 335, కేరళలో రూ.325 ఇస్తున్నారని.. ఆ రాష్ట్రాల మాదిరిగానే బీరు ధరను పెంచాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. బెవరేజ్ సంస్థల డిమాండ్ పై ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలిమరి...

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Ap government  beer  liquor prices  beverage companies  demand  stike  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more