100 children drowned by traffickers near malta

Migrants, drowned, Traffickers, Malta, Rome, Egypt, Italy, children

Hundreds of Migrants are Reported Drowned by Traffickers Near Malta

మధ్యదరలో వంద మంది చిన్నారుల జలసమాధి

Posted: 09/17/2014 08:28 AM IST
100 children drowned by traffickers near malta

మధ్యదరా సముద్రంలో మాల్టీస్ వద్ద జరిగిన నౌక మునక ఘటనలో వంద మంది చిన్నారులు జల సమాధి అయ్యారు. సుమారు 500 మంది జలసమాధి కాగా, వారిలో చిన్నారులే వంద మందికి పైగా వున్నారు. నౌక మునిగిన ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన ఒడ్డుకు చేరుకున్న వారు ఈ వివరాలను చెప్పారు. గత వారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వారు మరిన్ని వివరాలు వెల్లడించారు. ఈజిప్టు నుంచి ఇటలీకి ప్రయాణిస్తుండగా మధ్య సముద్రంలోకి తమ నౌకను స్మగర్లు అడ్డుకున్నారని తెలిపారు. తమ పడవలోకి రమ్మని నౌకలోని ప్రయాణికులకు హెచ్చరికలు చేశారని, అయితే భయాందోళన చెందిన ప్రయాణికులు.. ఎవ్వరూ వారి పడవలోకి వెళ్లలేదని చెప్పారు.

దీంతో కోపోద్రిక్తులైన స్మగర్లు తమ నౌకను ఢీకొట్టి.. నీళ్లలో మునిగిపోయేలా చేశారన్నారు. ఈ ఘటనతో హతాశులైన వందలాదిమంది ప్రయాణికులు జలసమాధి అవుతుంటే.. స్మగ్లర్లు వికటాట్టహాసపు నవ్వులు నవ్వారని ఆవేదన వ్యక్తం చేశారు. మనుష్యుల అక్రమరవాణాకు పాల్పడే స్మగ్లర్లే ఈ ఘాతుకానికి పాల్పడి వుంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు పాలస్తీనియన్లను, మరో తొమ్మిది మంది గ్రీకు, మాల్దీవులకు చెందిన వారిని కాపాడామని.. మిగతా వారందరూ మరణించి వుంటారని ఇంటర్నేషనల్ ఆర్గనేజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) తెలిపింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Migrants  drowned  Traffickers  Malta  Rome  Egypt  Italy  children  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more