Trs wins medal bypoll

by-poll, bjp, congress, Trs, lok sabha, landslide victory

Trs candidate prabhakar reddy wins Medal bypoll

‘మెదక్’లో కారు జోరు.. భారీ మోజారిటీతో గెలిచిన టీఆర్ఎస్

Posted: 09/16/2014 01:57 PM IST
Trs wins medal bypoll

మెదక్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి 2లక్షల 67 వేల 900 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలవగా, బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. మెదక్ జిల్లా రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో జరిగిన ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో టీఆర్ఎస్ తొలి రౌండ్ నుంచి ఆదిక్యం కనబరుస్తూ వచ్చింది. సంగారెడ్డి, గజ్వల్ లలో బీజేపి, నర్సాపూర్, పటాన్ చెరువు నియోజకవర్గాలలో కాంగ్రెస్ రెండవస్థానంలో నిలువగా, అన్ని నియోజకవర్గాల్లో కారు మొదటిస్థానంలోనే నిలిచింది. అధికార పక్షాన్ని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ చేసిన ప్రయత్నాలను మెదక్ ప్రజలు తిప్పికొట్టారు. టీఆర్ఎస్కే మళ్లీ పట్టం కట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామాతో వచ్చిన ఎన్నికలలో మరోమారు టీఆర్ఎస్ నే గెలిపించారు. కాంగ్రెస్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి జగ్గారెడ్డి వరుసగా రెండు, మూడో స్థానాలకు పరిమితమయ్యారు.

బంగారు తెలంగాణకు కృషి: కొత్త ప్రభాకర్ రెడ్డి
మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఊహించిందేనని ఆ పార్టీ లోక్ సభ అభ్యర్తి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఓటింగ్ శాతం తగ్గినా.. ఓటు వేసిన ప్రజలు మాత్రం టీఆర్ఎస్ పక్షాన నిలిచారన్నారు. మంచి మెజార్టీతో గెలిపించినందుకు తాను ప్రజలకు రుణపడి వుంటానన్నారు. గెలుపుకు కృషి చేసిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు టీఆర్ఎస్ను విశ్వసించారని, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ది చెందుతుందని నమ్మారని కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి టీఆర్ఎస్ కట్టుబడి ఉందని చెప్పారు

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : by-poll  bjp  congress  Trs  lok sabha  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more