దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లోని 3 లోక్ సభ, 33 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. గుజరాత్లో తొమ్మిది అసెంబ్లీ, ఓ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగగా, వడోదర లోక్ సభ స్థానాన్ని అధికార బీజేపి కైవసం చేసుకుంది. ఈ స్థానం నుంచి బరిలో నిలిచిన బీజేపి అభ్యర్థి రంజన్ భట్ లక్షా 83 వేల ఓట్ల మెజారిటీతో గెలుపోందారు. ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఆరింట బీజేపి ముందంజలో వుండగా, మరో మూడు స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది. ఇక గుజరాత్, రాజస్థాన్లలో ట్రెండ్స్ బీజేపీకి అసంతృప్తి కలిగించే విధంగా ఉన్నాయి. రాజస్థాన్లో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మూడుచోట్ల బీజేపీ, ఓ స్థానంలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 11 అసెంబ్లీ స్థానాల్లో ఆరుచోట్ల బీజేపీ, నాలుగు స్థానాల్లో సమాజ్వాదీ ఆధిక్యంలో ఉండగా, పశ్చిమ బెంగాల్లో రెండు స్థానాలకు గానూ తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయి.
తెలంగాణలో ‘కారు’, ఆంధ్రప్రదేశ్ లో ‘సైకిల్’ జోరు
ఇటు తెలంగాణలోని మెదక్ లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికలలో కారు జోరు కొనసాగుతుండగా, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నందిగామ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో సైకిల్ ముందంజలో దూసుకువెళ్తుంది. మెదక్లో మొదటి రౌండ్ లెక్కింపు పూరైయ్యే సరికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి 18 వేల 443 ఓట్ల అధిక్యంలో వున్నారు. టీఆర్ఎస్ కు 32, 394 ఓట్లు కాంగ్రెస్కు 13,951, బీజేపికి 7,014 ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు తీరును జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జతోపాటు ఎన్నికల సంఘం పరిశీలకుడు పంకజ్ అగర్వాల్ పరిశీలిస్తున్నారు. నందిగామ: కృష్ణా జిల్లా నందిగామ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. పది రౌండ్లు పూర్తయ్యేసరికి తెదేపా అభ్యర్థి తంగిరాల సౌమ్య 54,607 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కొనసాగుతున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more