అభివృద్ధి దిశగా దేశం దూసుకెళ్తున్నా ప్రజల్లో ఉన్న అసమానతలు, సామాజిక రుగ్మతలు మాత్రం ఇంకా తొలగటం లేదు. కుల, మత వివక్ష ఎప్పట్లాగే వ్యక్తుల జీవితాలను బలితీసుకుంటున్నాయి. కులాంతర ప్రేమ వివాహం చేసుకుందని అప్పట్లో ఓ తల్లితండ్రులు కూతురును హత్య చేయగా.., తాజాగా ప్రేమ వివాహం చేసుకుందని ఓ అన్న తన చెల్లి గొంతు కోశాడు.
ఒంగోలులోని పులివెంకటరెడ్డి కాలనీలో రాణి అనే యువతి ఉంటోంది. ఆమె ఇంట్లో వారిని కాదని ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో రాణిపై కుటుంబ సభ్యులు కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆవేశంతో రాణి అన్న ఆమెపై దాడి చేశాడు. కొట్టడంతో పాటు గొంతు కోశాడు. అన్న చేతిలో తీవ్ర గాయాలపాలైన రాణి కొత్తపట్నం రోడ్డులోని ఓ ప్రయివేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. ఈ దారణంపై మహిళా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక యువతి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు లేదా అని ప్రశ్నిస్తున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more