సమాజంలో దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతుంది. బట్టలు, అలవాట్లపై ఫారిన్ కల్చర్ ప్రభావం ఇప్పటికే ఉండగా.., నేరాల లోనూ ఈ కల్చర్ ప్రభావం చూపుతోంది. విదేశాల్లో హాలీవుడ్ యాక్షన్ సినిమాల తరహాలో జరిగే హత్యలు, దొంగతనాలు, దోపిడీలు ఇప్పుడు మన దేశంలో తెలుగు గడ్డపై కూడా జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో కట్టుకున్న భార్యనే కడతేర్చాడో భర్త. అంతేకాదు ఆమెను దారుణంగా చంపి శవంతో నేరుగా పోలిస్ స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయాడు.
చిత్తూరు జిల్లా సంగరాయకుంటలో సలీం అనే వ్యక్తికి భార్యపై అనుమానం ఉండేది. అనుమానం రోజురోజుకూ పెరిగి., భార్యపై విరక్తి కలిగింది. దీంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. అర్ధరాత్రి భార్య నిద్రపోతున్న సమయంలో.., కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఎలాగు పోలిసులకు తెలుస్తుంది కాబట్టి ముందుగా తానే లొంగిపోతే బాగుంటుంది అనుకున్నాడు. భార్య శవాన్ని తీసుకుని నేరుగా పోలిస్ స్టేషన్ కు వెళ్ళాడు. భార్యను హత్య చేశాను., తనను అరెస్టు చేయండి అని పోలిసులతో చెప్పాడు.
విషయం విన్న ఖాఖీలు ముందుగా ఖంగుతిన్నా.., తర్వాత తేరుకున్నారు. ముందుగా నిందితుడిని అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్య చేసిన నిందితుడిపై కేసు పెట్టినట్లు చెప్పారు. హత్యకు గల కారణలపై కూడా లోతైన విశ్లేషణ జరుగుతోందన్నారు. కోర్టులు, శిక్షలంటే భయముంటే ఇలాంటి నేరాలకు పాల్పడరు.., నేరం చేసి నేరుగా వచ్చి పోలిసులకే చెప్పి లొంగిపోయే ధైర్యం చేయరు అని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు. ఇప్పటికైనా మన చట్టాలను మరింత కఠినతరం చేయాలి. నేరం చేశాక శిక్ష కాదు.., నేరం చేయాలంటేనే శిక్ష గుర్తుకు వచ్చేలా భయం ఉండాలని భావిస్తున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more