మానవుని జీవితంలో అప్పుడప్పుడు కొన్ని వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇది కూడా అటువంటిదే అనుకోండి! జనసేనాధిపతి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ఆయనకు సంబంధం లేని విషయంలో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో బాలరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అదేమిటంటే.. రూ.50 నోట్ పై తన బొమ్మను ముద్రించుకుని జాతిపిత మహాత్మాగాంధీని కించపరిచే విధంగా పవన్ కల్యాణ్ ఫేస్ బుక్ లో ప్రచారం చేసుకుంటున్నాడని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పవన్ కల్యాణ్ పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన తన కంప్లైంట్ లో పేర్కొన్నాడు.
అంతేకాదు.. పవన్ కల్యాణ్ వందేళ్ల క్రితం పుట్టి వుంటే మహాత్మునికి బదులు తన బొమ్మే వేసుకునేవాడిననంటూ పవన్ ప్రచారం చేసుకుంటున్నాడని బాలరాజు ఫిర్యాదులో పేర్కొన్నాడు. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనని పవన్ ఏ విధంగా మహాత్ముడు అవుతాడంటూ అతను ప్రశ్నించాడు. పవన్ చేస్తున్న ఈ దురాక్రమానికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందేనని.. తనపై కేసు నమోదు చేసి జైల్లో వేయాలంటూ అతను ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్నాడు.
సాధారణంగా ఫేస్ బుక్ లో ఇటువంటి ఫోటోలు ఎన్నో వుంటాయి. నోట్లమీద గాంధీ బొమ్మ తొలగించి తమకు నచ్చిన హీరో ఫోటోలను పెట్టుకోవడం... మార్ఫింగ్ చేసనవి చాలా వుంటాయి. ఆ ఫోటో కూడా పవన్ అభిమానులే క్రియేట్ చేసి వుంటారు. అంతేకానీ.. పవన్ కు అటువంటి ఫోటోను ఎందుకు తయారుచేసుకుంటాడు చెప్పండి! అయినా పవన్ కల్యాణ్ కు వున్న క్రేజే అంతా! ఆ మధ్య అత్తారింటికి దారేది సినిమా ఆగిపోతే.. దానిపై అభిమానులు ఎన్నో ప్రచారాలు చేశాడో. ‘‘ఇంట్లో దేవుడు ఫోటో వుంది కదా అని గుడికి వెళ్లడం మానేస్తామా..? అలాగే పవన్ సినిమా క్యాసెట్ వచ్చిందని థియేటర్ కు వెళ్లకుండా వుంటామా..?’’ అంటూ ఆయన్ను దేవుడితోనే పోల్చేశారు. మరి దీనిమీద ఏమంటారు..?
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more