Air indian charging only 100 rupees for ticket

air india airlines, spice jet airlines, mobile phones, air india website, air india airlines website, air india tickets, air india flights, air india spice jet airlines, aeroplane passengers

Air Indian charging only 100 rupees for ticket : Air india airlines introducint a new offer for passengers. They charging only 100 rupess for ticket according to their ceremony

రూ. 100లకు మాత్రమే ఎయిర్ ఇండియా టికెట్!

Posted: 08/27/2014 12:48 PM IST
Air indian charging only 100 rupees for ticket

ఒకప్పుడు సిమ్ కార్డులు కొనుక్కోవాలంటే దానికి ఎన్నో ఫార్మాలిటీస్, ష్యూరిటీ సంతకాలు వంటివి చేసిన అనంతరం దాదపు రూ. 1500 వరకు చెల్లించాల్సి వుండేది! కానీ ఈరోజుల్లో మాత్రం ‘‘ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ’’ అంటూ ఎక్కడబడితే అక్కడ బోర్డులు తెగ కనబడుతున్నాయి. వీటితో పాటు ఆఫర్లు కూడా! ఆ మాటకొస్తే సెల్ ఫోన్ల పరిస్థితి కూడా అలాగే వుందిలెండి! ఇలా చాలావరకు వస్తువుల ధరలు దాదాపుగా తగ్గిపొయ్యాయి. ఎందుకంటే.. ప్రస్తుతమున్న పోటీప్రపంచంలో నెగ్గుకురావాలంటే ప్రేక్షకులను తమవైపుకు ఆకర్షించుకునేందుకే కాలానికి అనుగుణంగా ధరలు తగ్గించుకున్నాయి సదరు సంస్థలు!

ఇప్పుడు తాజాగా వీరి జాబితాలోని విమానయానరంగాలు కూడా చేరిపోయినట్టు కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న ‘‘స్పైస్ జెట్’’ విమానయాన సంస్థవారు వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండుగలు వరుసగా వస్తున్న నేపథ్యంలో వాటిని క్యాష్ చేసుకోవడానికి తమ ఛార్జీలను భారీగా తగ్గించేసింది. కేవలం రూ.1888కే విమానంలో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తోంది. అయితే ఇది అన్ని రూట్లలో కాకుండా కేవలం నిర్దేశించిన మార్గాలలో మాత్రమే అమలు అయ్యేట్లు ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దీని బాటలోనే ‘‘ఎయిర్ ఇండియా సంస్థ’’ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థవారు మరీ విచిత్రంగా ఏకంగా రూ.100 లకు టికెట్ ధరను తగ్గించేసి అందరినీ షాక్ కు గురిచేశారు.

ఇండియన్ ఎయిర్ లైన్స్ లో 2007 ఆగస్టు 27వ తేదీన ఎయిర్ ఇండియా విలీనమైంది. దీంతో దీంతో ఆగస్టు 27ను ఎయిర్ ఇండియా దినోత్సవంగా వ్యవహరిస్తారు. ఎయిర్ ఇండియా దినోత్సవాన్ని రుపుకోవడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ప్రయాణికులకు కేవలం రూ.100 లకే టికెట్ కొనుగోలు చేసేందుకు బంపర్ ఆఫర్ ని ప్రకటించింది. అయితే ఇందన సర్ ఛార్జీ, సంబంధిత పన్నులు, పీజులు వంటి అదనంగా చెల్లించాల్సి వుంటుంది. స్పైస్ జెట్ లాగా ఈ ఆఫర్ పండుగరోజులవరకు వుండదు... కేవలం కొన్నొరోజుల వరకు మాత్రమే పరిమితంగా వుంటుంది. అది ఆఫర్ ఆగస్టు 27(నేటి) నుంచి 31 వరకూ మాత్రమే బుక్ చేయాలని, ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 30 మధ్య జరిగే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఎయిర్ ఇండియా వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాల్సి వుంటుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : air india airlines  spicejet airlines  ticket charges  airlines websites  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more