(Image source from: araku ysrcp mp kottapalli geetha jumps into tdp party)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి అరకు ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీత.. ఇప్పుడు ఆ పార్టీకే పెద్ద షాకిచ్చారు. గత కొన్నిరోజుల నుంచి ఈమె పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు తెలిసిందే! జగన్ ప్రమేయం లేకుండా ఈమె రెండుసార్లు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. దాంతో ఆమె జగన్ కు మోసం చేసి, పార్టీ మారుతున్నారని వైకాపా నేతలు ఆరోపణలు చేశారు. అయితే వాటిని ఖండించిన గీత.. కేవలం తన ప్రాంత అరకు అభివృద్ధి కోసంమే బాబుతో కలిశానని.. లేనిపోని అనవసర రాద్ధాంతాన్ని సృష్టించోద్దని ఆమె అప్పట్లో స్పష్టం చేసింది. అయితే ఆమె మీద ఆరోపణలు మాత్రం తగ్గలేదు. ఏకంగా ఫేస్ బుక్ లో ఆమెపై అసభ్యంగా వ్యాఖ్యాలు చేస్తూ పోస్టులు కూడా చేశారు. అయితే దీనిమీద జగన్ ఏమీ స్పందించకపోవడం ఆమె టీడీపీ పార్టీలోకి జాయిన్ అవుతున్నట్టు పేర్కొంది.
కొత్తపల్లి గీత ఈ నేపథ్యంలో మాట్లాడుతూ.. ‘‘వైసీపీతో కలిసి ఇకపై పనిచేయబోను’’ అంటూ తెగేసి చెప్పింది. టీడీపీ, బీజేపీ పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలని భావిస్తున్నానని ఆమె వ్యాఖ్యానించారు. టీడీపీ నేత, సీఎం చంద్రబాబు నాయుడుతోనే అరకు అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పిన ఆమె.. తాను ఎంపీగా గెలిచిన అరకును అభివృద్ధి చేయడం కోసం దేనికైనా రెడీ అన్న రీతిలో వ్యాఖ్యానాలు చేశారు. ఒకవేళ తనపై వైసీపీ అనర్హత వేటు వేస్టే.. టీడీపీ అభ్యర్థిగా తిరిగి మళ్లీ పోటీ చేసి గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. వైసీపీలో మహిళలకు గౌరవ మర్యాదలు ఏమాత్రం లేవని.. తనపై ఫేస్ బుక్ లో అసభ్యంగా పోస్టులు వచ్చినప్పటికీ జగన్ దానిపై ఇప్పటివరకు స్పందించలేదని అన్నారు. జగన్ ను అన్నగా భావిస్తే.. ఆయన మాత్రం చాలా అవమనానించాడంటూ ఆమె ఆరోపణలు చేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more