112 indians coming from ebola country liberia

ebola virus, indians, indian in liberia, liberia indians, ebola virus latest news, ebola virus country, ebola virus news

112 Indians coming from ebola country liberia : mumbai airlines alerted because 112 indians coming from ebola liberia country

‘‘ఎబోలా’’ దేశం ముంబైకి వచ్చిన ఇండియన్స్!

Posted: 08/26/2014 01:32 PM IST
112 indians coming from ebola country liberia

ప్రపంచ అగ్రరాజ్యాలను ఇంతవరకు ఏ వ్యాధి భయపెట్టని విధంగా ‘‘ఎబోలా’’ వణికిస్తున్న విషయం తెలిసిందే! తమ ప్రాంతాల్లో ఇది ఎక్కడ వ్యాపిస్తుందోనని ప్రతిఒక్కరూ ఆయా ప్రదేశాల్లో అప్పుడే సిబ్బందులను ఏర్పాటు చేసి పెట్టుకున్నారు. అంతటి భయానకరమైన ఎబోలా వైరస్ మహమ్మారి వైరస్ బారిన పడిన లైబీరియా మొత్తం అతలాకుతలైపోయింది. అక్కడే దాదాపు 1000కి మంది పైగా ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. చికిత్స అందిస్తున్న డాక్టర్లు కూడా ఈ వైరస్ కు గురై ప్రాణాలను కోల్పోయారు. దీంతో లైబీరియాలో భ్రదతాఏర్పాట్లు భారీ స్థాయిలో నిర్వహించారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఇది వ్యాపించకుండా వుండేందుకు వాళ్లు చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఎవరికీ, ఎక్కడ, ఎలా వ్యాపిస్తుందోనన్న భయంతో ప్రజలు ఎన్నో జాగ్రత్తల నడుమ బయటికి వస్తున్నారు. అటువంటి ప్రాంతం నుంచి మన ఇండియన్స్ దాదాపు 112 మంది తిరిగి తమ స్వదేశానికి అంటే ఇండియాకి తిరిగి వస్తున్నారు.

ఎబోలా మహమ్మారి బారినపడి అతలాకుతలమవుతున్న లైబీరియా నుంచి 112 మంది భారతీయులు మంగళవారం స్వదేశం వస్తున్నారన్న వార్తలు వచ్చిన అనంతరం భారతీయ ప్రభుత్వం అలర్ట్ ప్రటకించింది. తొలువ వీరంతా ముంబైకి చేరుకుని అక్కడి నుంచి తమతమ స్వస్థలాలకు వెళతారు. అయితే ముందుగా వీరికి ఎబోలా వైరస్ సోకిందా..? లేదా..? అన్న విషయాన్ని రూఢీ చేసుకున్న తర్వాతకాని వారిని వదలడం సాధ్యం కాకపోవచ్చు. ఒకేసారి ఇంతమంది ఎబోలా వైరస్ వ్యాప్తి చెందిన ప్రాంతం నుంచి రావడంతో ముంబై ఎయిర్ పోర్టులో అలర్ట్ ప్రకటించారు. వారందరికీ ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేశారు. పైగా వీరంతా వేర్వేరు విమానాల నుంచి వస్తుండటంతో అధికారులు అందరూ అప్రమత్తమయ్యారు.

లైబీరియా నుంచి వస్తున్న మన ఇండియన్స్ కి ఎబోలా వైరస్ బారిన పడకుంటే ఎటువంటి సమస్య లేదుకానీ.. ఒకవేళ ఒక్కరైనా దీని బారినపడినవారుంటే మాత్రం చాలా పెద్ద ప్రమాదమే అవుతుంది. అధికారులు చాలా జాగ్రత్తలతో అతనికి చికిత్స చేసి, రహస్యమైన ప్రదేశంలో వుంచాల్సి వుంటుంది. ఇలాకాని పక్షంలో ఆ వ్యక్తి బయటిప్రపంచంలోకి వస్తే మాత్రం.. ఇండియా ఇక ‘‘ఎబోలా దేశం’’గా మారిపోయే ప్రమాదం వుంది. ఎందుకంటే.. మన భారతదేశంలో కాలుష్యం తీవ్రత ఎంతుందో తెలిసిందే! అటువంటి వాతావరణంలో ఈ వైరస్ వ్యాపిస్తే మాత్రం అంతే సంగతులు! గాలికన్నా ఎక్కువ వేగంతో ఇది స్పీడుగా పయనించి దేశం మొత్తం మీద పాగా వేసేస్తుంది. కాబట్టి.. వారిలో ఏ ఒక్కరు ఎబోలాకు గురైన వారు వుండకూడదనే ఆశిద్దాం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ebola virus  mumbai airport  liberia  indians  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more