Pakistan forces violation attack on india targeting 22 bsf posts

pakistan india border, pakistan forces violation attack, border violation attack, paksitan forces, indian forces, border attack

pakistan forces violation attack on india targeting 22 bsf posts

పాక్ ఉల్లంఘన కాల్పుల్లో ఇద్దరు భారత్ పౌరుల మృతి!

Posted: 08/23/2014 04:29 PM IST
Pakistan forces violation attack on india targeting 22 bsf posts

పాకిస్తాన్ - ఇండియా బార్డర్ లో వాతావరణం చాలా వేడెక్కిపోయింది. పాకిస్థాన్ దళాలు వరుసగా కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూనే వున్నాయి. శనివారం ఉదయం కూడా భారత్ - పాకిస్థాన్ ల మధ్య కాల్పుల విరమణను విధించిన నేపథ్యంలో.. పాక్ దళాలు వాటిని ఉల్లంఘించి కాల్పులు జరిపారు. ఆర్ఎస్ పురా, అర్నియా సెక్టార్లలో వున్న 22 భారత శిబిరాలే లక్ష్యంగా చేసుకున్న పాకిస్తాన్.. భారీగా ఫైరింగ్ చేశారు. దీంతో ఈ ఫైరింగ్ ల మధ్య బార్డర్ దద్దరిల్లిపోయింది. ఈ యుద్ధంతో ఏ సంబంధం లేని ఇద్దరు సాధారణ పౌరులు తమ ప్రాణాలను కోల్పోగా.. ఓ జవాన్ సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ నేపథ్యంలోనే ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. మహమ్మద్ అక్రమ్, అతని 13ఏళ్ల కుమారుడు ఈ కాల్పుల్లో చనిపోయినట్లు స్పష్టం చేశారు. అలాగే తీవ్ర గాయాలపాలైన ఏడుగురిలో అక్రమ్ భార్య, అతని ముగ్గురు, ఓ బీఎస్ఎప్ కానిస్టేబుల్ కూడా వున్నట్లు ఆయన వివరించారు. వారందరికీ జమ్మూ మెడికల్ కాలేజ్ కు తరలించి.. అక్కడ మెరుగైన చికిత్స చేయిస్తామని ఆయన వెల్లడించారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, నరేంద్రమోదీతో కలిసిన అనంతరం యుద్ధాలు సమసిపోతాయనుకున్న తరుణంలో.. ఇవి మరింతగా పెరిగిపోయాయి. ఈ సమస్య మీద ఇద్దరు ప్రధానులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india border  pakistan violation attack  india pakistan border  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more