Telangana water board increases the charges of water bill to ayyappa society

ayyappa societies, ayyappa society houses, telangana government, water board, telangana water board, trs government, water bills,

telangana water board increases the charges of water bill to ayyappa society : trs government takes another action on ayyappa societies. This time they increased the water bill charges thrice

‘‘అయ్యప్ప’’ను జలగండంలో ముంచేసిన టీఆర్ఎస్!

Posted: 08/23/2014 02:48 PM IST
Telangana water board increases the charges of water bill to ayyappa society

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణాలో వున్న అక్రమ కట్టడాలను కూల్చివేసిన వేసిన సంగతి తెలిసిందే! అందులో భాగంగానే ముఖ్యంగా మాధాపూర్ లోని అయ్యప్ప సొసైటీ వాళ్లకు అయితే చుక్కలు చూపించేసింది! నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలను చేపట్టారంటూ అయ్యప్ప సొసైటీ వాసులపై చర్యలకు ఉపక్రమించింది. ఎలాగూ ఈ కట్టడాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించబడ్డాయంటూ మొన్నటికిమొన్న ట్రాన్స్ కో అధికారులు కరెంట్ బిల్లులు భారీగా పెంచేసి అక్కడి వాసులకు పెద్ద షాకే ఇచ్చింది. ఇప్పుడు తాజాగా అదే తరహాలో జలమండలి అధికారులు పయనించేందుకు సిద్ధమయ్యారు.

ఈసారి వారినుంచి వాటర్ బిల్లులను మూడు రెట్లు ఎక్కువగా వసూలు చేయాలని జలమండలి నిర్ణయం తీసుకుందని తాజా సమాచారం! ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు లేవనే ఆరోపణలతోనే జలమండలి అధికారులు ఇలా ఛార్జీల మోతకు దిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి జలమండలి అధికారులు త్వరలోనే అయ్యప్ప సొసైటీకి నోటీసులు జారీచేయాలని నిర్ణయించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేనివాళ్లంతా అధిక ఛార్జీలు చెల్లించాల్సి వుంటుందని ఆ నోటీసుల్లో పేర్కొంటున్నారు. అయితే.. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని.. తమను ఎలాగైనా ఈ సొసైటీ వెళ్లగొట్టాలనే నెపంతోనే ఇలా వ్యవహరిస్తోందని సోసైటీ వాసులు ఆరోపణలు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : madhapur ayyappa society  kcr  trs government  water board  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more