Senior citizens married after 58 years who are in live in relationship

live in relationship, senior citizens, senior citizens married after 58 years, live in relationship marriages, old couple marriage in vijayanagaram

senior citizens married after 58 years who are in live-in-relationship : A live-in-relationship couple married after 58 years by their grandsons and grand daughters

పెళ్లి చేసుకోకుండా 58ఏళ్లు సహజీవనం చేసిన జంట!

Posted: 08/21/2014 03:09 PM IST
Senior citizens married after 58 years who are in live in relationship

ప్రస్తుతయుగంలో సహజీవనం కూడా ఒక ఆచారంగా మారిపోయింది. మొదట పాశ్చాత్తదేశాల్లో మొదలైన ఈ సంస్కృతి.. రానురాను మన భారతదేశంలో కూడా ఒక సంప్రదాయంగా మారిపోయింది. ఒకరికొకరు నచ్చితే చాలు.. తమకు ప్రపంచంతో పనిలేదన్నట్టు పెళ్లి చేసుకోకుండా జీవితం గడుపుతారు. ఒకవేళ తమ మధ్య ఏమైనా సమస్యలు ఏర్పడితే.. విడాకులు వంటి కోర్టు ఇబ్బందులు లేకుండా స్వచ్ఛందంగా విడిపోవచ్చు. ఇక నేటియువతర వ్యవహారం ఎలావుందో అందరికీ తెలిసిందే! తమకిష్టమొచ్చినట్లు వ్యవహరిస్తుంటారు. ప్రపంచంమొత్తం తమదే అన్నట్టు ఫీలింగ్ లో మునిగిపోతారు. ఇతరులు ఎలా వుంటే మనకేం.. మనం బాగున్నామా లేదా..? అంటూ ఎంజాయ్ చేస్తుంటారు. సంస్కృతీ - సంప్రదాయాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటుంటారు. అటువంటి స్వేచ్ఛ తమకు జీవితాంతం కావాలనే ఆశతో సహజీవనాన్ని వాళ్లు అలవాటుగా మార్చుకున్నారు. అయితే ఇక్కడ మనం చదవబోయేది నేటియువతర సహజీవనం కథ కాదు.. దాదాపు 58ఏళ్ల క్రితం నాటిది!

విజయనగరం జిల్లా కురుపాంకు చెందిన రామస్వామి, శ్రీకాకుళం జిల్లా వీరఘట్టానికి చెందిన పోలమ్మ ఇద్దరూ అనుకోకుండా ఒక చోట కలుసుకున్నారు. అప్పటినుంచి ప్రేమలో మునిగిపోయిన వీరు పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు మనసులు కలిశాయి కదా ఇక పెళ్లి ఎందుకులే అనుకున్నారో.. ఏమో.. వివాహం చేసుకోకుండా దాదాపు 58 ఏళ్లవరకు సహజీవనం చేశారు. ఈ మధ్యకాలంలో వీరికి నలుగురు పిల్లలు జన్మించారు. వారిక్కూడా పెళ్లిళ్లయి పిల్లలు పుట్టారు. అయినా కాలం సాఫీగా జరుగుతోంది కదా అని వీళ్లు పెళ్లి చేసుకోకుండా వుండిపోయారు. అయితే పెళ్లి చేసుకోలేదన్న నిరాశే వీరిని వెంటాడుతూనే వుంది. పెళ్లి చేసుకోకుండా ఇన్నాళ్లూ కాలం గడిపాం అన్న ఆవేదన వారిలో ఎప్పటికీ వుండేది. దీంతో వీరి ఆవేదనను గ్రహించిన వారి మనుమలు, మనువరాళ్లు ఇన్నాళ్లకు వీరికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. దాంతో వీరికి బుధవారంనాడు వెంకన్న సన్నిధిలో కుటుంబసభ్యుల మధ్య పెళ్లి జరిపించారు. అయితే ఇన్నేళ్లూ పెళ్లి చేసుకోకున్నాక.. ఆదర్శ దంపతులకు వీరు మారుపేరుగా నిలిచిపోయారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : live in relationship  senior citizens marriage  couples  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more