Poultry farming using more antibiotic in chicken

poultry farming using more antibiotic in chicken, antibiotic which causes harmful diseases to humans, poultry farming in india, poultry centers in india, antibiotic in chicken, antibiotic in chicken will cause diseases, antibiotic diseases to humans, chicken eating people, chicken anitibiotic, antibiotic latest news, antibiotics uses in poultry farms

poultry farming using more antibiotic in chicken which causes harmful diseases to humans

‘‘కోడి మాంసం’’ ఎక్కువగా తింటే.. తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే!

Posted: 07/30/2014 05:41 PM IST
Poultry farming using more antibiotic in chicken

ప్రస్తుతకాలంలో కోడి మాంసాన్ని ఎక్కువగా తినే మాంసాహారులు ఎంతో మంది వున్నారు. మటన్ కంటే తక్కువ ధరకే లభించడం కాకుండా మాంసాల్లోకెల్లా దీని రుచే చాలా డిఫరెంట్ గా వుంటుంది. అందువల్లే ప్రతి హోటల్ లోనూ కోడి మాంసానికి సంబంధించి రకరకాల రుచులతో కూడిన ఆహారపదార్థాలను తయారుచేస్తుంటారు. వీటికి సంబంధించిన రకాలు బహుశా ఏ మాంసానికి వుండవేమో! అందుకే చాలామంది మాంసామారులు కోడికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.

కానీ ఈ మాంసాహారం ఆరోగ్యానికి మంచిదేనా..? కాదా..? అనే విషయాల గురించి మాత్రం ఎవ్వరికీ తెలియదు. దొరికింది కదా అని ఎక్కబడితే అక్కడ లాగించేస్తుంటారు మన మాంసాహార ప్రియులు. ఈ కోడిమాంసంపై పరిశోధనలు చేసిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ (సీఎస్ఈ) అనే పరిశోధకులు.. ఈ మాంసాన్ని ఎక్కువగా తింటే ఆరోగ్యానికి అంత సురక్షితం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే.. వీటిలో యాంటిబయాటిక్స్ అవశేషాలు దాదాపు 40 శాతం వరకు వుంటాయని వారు పేర్కొంటున్నారు. సీఎస్ఈకి చెందిన పొల్యూషన్ మానిటరింగ్ లేబొరేటరీ (పీఎంఎల్) వారు కోడిమాంసం శాంపిళ్లపై పరిశోధనలు చేపట్టి.. అందులో వున్న లోపాలను తెలియజేసింది.

సాధారణంగా మనుషులకు యాంటిబయాటిక్స్ వాడకం విషయంలో ఎటువంటి ఆంక్షలు లేవు. కానీ పౌల్ట్రీ పరిశ్రమల్లో మాత్రం వీటిని విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు తమ పరిశోధనల ద్వారా వెల్లడించింది. కోళ్లు తక్కువ సమయంలో త్వరగా ఎదగాలని, బరువు ఎక్కువ పెరగాలనే ఉద్దేశంతో ఈ యాంటీబయాటిక్స్ ను పరిమితి లేకుండా ఇవ్వడం ఒక పరపాటిగా మారిపోయిందని సదరు పరిశోధకులు చెబుతున్నారు. ఇలా ఇష్టారాజ్యంగా ఎలాబడితే అలా యాంటీబయాటిక్స్ ను కోళ్లకు ఇవ్వడం ద్వారా.. వాటిలో వుండే బ్యాక్టీరియా, యాంటీబయాటిక్ నిరోధకతను చాలావరకు పూర్తిగా సంతరించుకుంటాయని వారు స్పష్టం చేస్తున్నారు.

ఆ విధంగా సంతరించుకున్న మొండి బ్యాక్టీరియాలు గల కోళ్ల మాంసాలను సేవించినప్పుడు అవి మనుషులకు సంక్రమిస్తాయని, తద్వారా రకరకాల హానికరమైన వ్యాధులు వస్తాయని సీఎస్ఈ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంటే... మనం ప్రమాదకరమైన వ్యాధులను కొనితెచ్చుకుంటున్నామట! మరి దీని నుంచి విరుగుడు ఏమైనా వుందా అంటే అందుకు వారు.. ‘‘పౌల్ట్రీ పరిశ్రమల్లో యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించినప్పుడే చికెన్ సురక్షితమైనదిగా భావించాల్సి వుంటుందని’’ వారు ఖరాఖండీగా తేల్చి చెబుతున్నారు. కాబట్టి చికెన్ తినే మాంసాహార ప్రియులు... దానిని తినేముందు కాస్త ఆలోచించుకుని తక్కువ తింటే బాగుంటుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more