‘‘పెట్రోల్’’ సహాయంతో నడిచే వాహనాదారులకు త్వరలోనే ఒక శుభవార్త రానుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలను తగ్గించాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నట్టు తాజా సమాచారం! గత కొన్ని రోజుల నుంచి అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల ఈ నిర్ణయానికి వచ్చినట్లు వారు తెలుపుతున్నారు. ఇంకొన్నాళ్లవరకు ఇదే వ్యవహారం కొనసాగితే... పెట్రోల్ ధరలను తగ్గించడం ఖాయమని వారు ఖరాఖండీగా చెబుతున్నారు.
అయితే మరీ ఎక్కువ సంబరపడిపోకండి సుమా! ఆయిల్ కంపెనీలు పెట్రోల్ ధరలను కేవలం 1 రూపాయి మాత్రమే తగ్గించనున్నట్టు పేర్కొంటున్నాయి. అంతేకాదు బాబోయ్... ఈ విషయం మీద కేంద్రప్రభుత్వంతో మాట్లాడిన తరువాతే తుదినిర్ణయం తీసుకుంటామని సదరు కంపెనీలు స్పష్టం చేశాయి. ఒకవేళ ఈ నిర్ణయం మీద కేంద్రప్రభుత్వం ఓకే అని వెల్లడిస్తే... ఏప్రిల్ తరువాత పెట్రోల్ ధరలు.. అదికూడా 1 రూపాయి మాత్రమే తగ్గించనున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న కొంతమంది విశ్లేషకులు.. ‘‘అమ్మ బాబోయ్.. పెట్రోల్ ధరలు మరీ ఇంతగా తగ్గిస్తే.. జనాలు సంతోషంతో మూర్ఛపడిపోరూ’’ అని సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. మరీ విడ్డూరం కాకపోతే... పెట్రోల్ ధరలు 1 రూపాయి మాత్రమే తగ్గించడం కాకుండా.. దానిమీద కేంద్రంతో మీటింగులు.. ఒకవేళ సక్సెస్ అయితే ఏప్రిల్ తరువాత! మరి దీనిమీద మీ అభిప్రాయమేంటి..?
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more