కార్మిక సంక్షేమ నిధి నుంచి రూ.300 కోట్లు వాడుకున్న ఆర్టీసీ యాజమాన్యం మీద నిరసన చూపుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో ఆగస్ట్ 2 నుంచి సమ్మె చెయ్యబోతున్నారు ఆర్టీసి కార్మికులు.
ఈమేరకు రెండు రాష్ట్రాలలోను సమ్మెకు పిలుపునిచ్చిన ఎంప్లాయీస్ యూనియన్ జూలై 30 నుంచి ఆగస్ట్ వరకు విజయవాడ, హైద్రాబాద్ లలో మహా దీక్షను చేపట్టనున్నారని తెలియజేసారు. ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి కె.రాజారెడ్డి హైద్రాబాద్ లోను, ఉప కార్యదర్శి వై.వి.రావు విజయవాడలోను మహా నిరాహార దీక్షలు చేపట్టనున్నారు.
ప్రభుత్వం నుంచి రావలసిన రాయితీ సకాలంలో అందకపోవటంలో అత్యవసర పరిస్థితుల్లో ఆ సొమ్మును వాడుకోవలసి వచ్చిందని చెప్పిన ఆర్టిసి ఎండి పూర్ణచంద్రరావు తిరిగి ఇవ్వటానికి ఎటువంటి సమయాన్ని కానీ హామీని కానీ ఇవ్వకపోవటంతో ఎంప్లాయీస్ యూనియన్ సమ్మెకు దిగుతున్నారు.
ఆర్టీసీ కార్మికులకు కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ, స్టాఫ్ బెనెఫిట్ ట్రస్ట్, స్టాఫ్ రిటైర్ మెంట్ బెనెఫిట్ స్కీం లద్వారా కార్మికులు ఋణాలను పొందుతుంటారు. వాళ్ళ దగ్గర్నుంచి జీతాలలో కట్ చేసిన ఆర్టీసీ యాజమాన్యం ఆ సొమ్మును తన అవసరాలకు వాడుకుంది కానీ ఆయా సోసైటీలకు చెల్లించలేదు. నాలుగు నెలలుగా ఇలా జరుగుతుండటంతో ఆ సొసైటీలు కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేయటం జరిగింది. దానితో ఋణాల కోసం దరఖాస్తులు పెట్టుకున్న 18 వేల కార్మికులకు ఆ సొసైటీల నుంచి ఆర్థిక సాయం రావటం అందటం లేదు.
రంజాన్ లోపులో ఆర్టీసీ ఆ మొత్తాన్ని చెల్లించకపోతే 30 నుంచి నిరాహార దీక్షలు, ఆగస్ట్ 2 నుంచి సమ్మెలు తప్పవంటున్నారు ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more