Ap all parties leaders flying to delhi

AP All Parties Leaders flying to Delhi, An all-party leaders in Andhra Pradesh, telangana state, Eamcet admissions, Telangana and Andhra Pradesh, EAMCET counselling,

All-party delegation, led by Ganta, meets Rajnath Singh. The Telangana government’s decision was against Article 371(D), Presidential Order and six-point formula to facilitate common admissions and also against Article 15 of the Constitution

మన ఎంసెట్ ఎపిసోడ్ లొల్లి ఢిల్లీలో?

Posted: 07/24/2014 04:13 PM IST
Ap all parties leaders flying to delhi

రాష్ట్ర విభజన తరువాత.. రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక గవర్నర్ పాలనలో.. తెలుగుప్రజలు జీవస్తున్నారు. అయితే రెండు రాష్ట్రాల మద్య అనేక సమస్యలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా మా పిల్లలు, మీపిల్లలు అనే విషయం రెండు రాష్ట్రాల నేతల మద్య మాటల యుద్దం జరుగుతుంది. తెలుగు విద్యార్థుల జీవితాలు .. రాజకీయ నాయకుల మద్య నలిగిపోతున్నాయి. ఈ సమస్య కు త్వరగా పరిష్కారించుకోవాలని, విద్యార్థులకు నష్టం వాటిల్లకుండ ఉంటేందుకు .. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి కేంద్రంతో తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తున్న తీరును చెప్పటం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ అఖిలపక్షమంతా తరలివెళ్లి తెలంగాణ ప్రభుత్వ తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. స్థానికత నిబంధన, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం మేరకు ఉమ్మడి ప్రవేశాల కోసం కేంద్రం దగ్గరకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తున్నట్లు మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు.

ప్రధాని మోదీతోపాటు కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, రాజ్ నాథ్ సింగ్ లను అఖిలపక్ష నేతలంతా కలవటం జరిగింది. స్థానికత అంశంపై 1956 కటాఫ్ పై తెలంగాణ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడంతో ఆంధ్రా ప్రాంత నేతలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎంసెట్ కౌన్సి లింగ్ చాలా ఆలస్యం జరిగిందిన కేంద్రం మంత్రులకు ఆంద్రప్రదేశ్ మంత్రులు వివరించారు. ఆంద్రప్రదేవ్ రాష్ట్ర పునర్వ్యస్థీకరణ పారా 95 కు వ్యతిరేకంగా ప్రయత్నించటం జరుగుతుందని గుర్తించారు. అంతేకాకుండా ఆర్థికల్ 371(డి) ప్రకారం రాబోయే 10 సంవత్సరాలు ఉమ్మడి ఎంసెట్ ప్రవేశ ప్రక్రియ కొనసాగాలని ఆంద్రమంత్రులు కోరటం జరిగింది.

ఇటీవల మంత్రి గంటా చాంబర్ లో సమావేశమైన అఖిలపక్ష నేతలు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని భావించారు. ఆ తర్వాత చంద్రబాబుతో చర్చలు జరిపిన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావుతోపాటు బీజేపీ, వైసీపీ ఎంపీలు బుట్ట రేణుక, మరియు అవినాష్ రెడ్డి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నేతల బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ , ఆరోగ్య శాఖ మంత్రిని, అలాగే వెంకయ్య నాయుడ్ని కలిసి ఎంసెట్ కౌన్సిలింగ్ పై ఉమ్మడి నోటిఫికేషన్ ఇప్పించాలని కోరారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్థానికతపై న్యాయపోరాటం చేయాలని భావిస్తున్నారు. కోర్టుకు వెళ్లడంతోపాటు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more