చిత్ర విచిత్రాలు అన్ని .. రైల్లోనే జరుగుతాయి. మొన్న ఏకంగా ఎలుకలు ఒక గ్రామాన్నే ఏర్పాటు చేసుకున్నాయి. ఈరోజు ప్రయాణికుడు తినే భోజనంలో.. బొధ్దింకను ఫ్రీగా.. ఇవ్వటం జరిగింది. ఇది రైల్వే అధికారుల నిర్లక్ష్యమో, లేక కాంట్రాక్టర్ల బలుపొ తెలియదు గానీ ప్రయాణికుల ప్రాణాలతో.. చెలగాటం ఆడుతున్నారు. భారీ రేట్లు వసూలు చేసే చేతులకు.. ఇలాంటి భోజనం ఎలా పెడుతున్నారో .. ఎవరికి అర్థం కావటంలేదు.. ‘‘అన్నిట్లు సొంత లాభం చూసుకుంటే.. పై దేవుడు ఏదో ఒకరోజు.. నీ కుటుంబం పై సొంత లాభం చూసుకుంటాడు’’.
అన్నం పరబ్రహ్మ స్వరూపిణి. అందుకే రాజుల కాలం నుండి ..నేటి రాజకీయ నేతల కాలం వరకు.. ‘‘అన్నదానం’’ కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతున్నాయి. ప్రత్యేక పుణ్యక్షేత్రాల్లో.. నిత్యం అన్నదానం చేస్తున్నారు. రైల్వే కాంట్రాక్టర్లు .. అన్నాన్ని అమ్ముకుంటూ కూడా.. అన్యాయంగా అమాయక ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. గొప్పలు చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వంలో కూడా ప్రజలకు సరైన న్యాయం జరగటంలేదని ఈ సన్నివేశంతో బయటపడింది.
దేశంలో ఆధునిక రైళ్ళుగా పేరు తెచ్చుకున్న రాజధాని ఎక్స్ ప్రెస్ లు 'పేరు గొప్ప ఊరు దిబ్బ' చందంగా తయారయ్యాయి. వాటిలో ప్రయాణికులకు సరఫరా చేసే అహారం నాసిరకంగా ఉంటోందని ఎప్పటినుంచో ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా, కోల్ కతా-న్యూఢిల్లీ (హజ్రత్ నిజాముద్దీన్) రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఓ ప్రయాణికుడు తనకు సరఫరా చేసిన ఆహారంలో బొద్దింకను చూసి విస్తుపోయాడు.
ఈ సమాచారం రైల్లో మిగతా ప్రయాణికులకు కూడా తెలియడంతో వారు ఆందోళనకు దిగారు. యూపీలోని ముగుల్ సరాయ్ వద్ద గంటపాటు రైలును నిలిపివేశారు. కాగా, ఆ ఆహారాన్ని పాట్నా స్టేషన్ వద్ద రైలులోకి ఎక్కించినట్టు తెలుస్తోంది. రైల్వే మంత్రి సదానంద గౌడ ఇటీవలే మాట్లాడుతూ, ఆహార నాణ్యత విషయంలో రాజీపడబోమని, నాసిరకం ఆహారం సరఫరా చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ హెచ్చరికలను సైతం క్యాటరింగ్ కాంట్రాక్టర్లు పెడచెవిన పెడుతున్నట్టు తాజా ఉదంతం వెల్లడిస్తోంది.
మంచి భోజనం పెట్టనందుకు శిక్ష ఇదే..
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more