England vs india lord s test day 5 india win by 95 runs

India win Lords test by 95 runs, England vs India Lord's Test Day 5, India beat England, Historic win,

- India have won by 95 runs with Ishant Sharma taking a career-best 7 for 74 to 'bounce' out England for 223.

లార్డ్స్ లో భారత్ చరిత్మాతక విజయం !

Posted: 07/21/2014 07:37 PM IST
England vs india lord s test day 5 india win by 95 runs

టీమిండియా లార్డ్స్ లో చిరస్మరణీయ విజయం సాధించింది. ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య లార్డ్స్ లో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు చెలరేగారు. తొలి ఇన్నింగ్స్ లో భువనేశ్వర్ కుమార్ ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ నడ్డి విరిస్తే, రెండో ఇన్నింగ్స్ లో ఇషాంత్ శర్మ ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ ను వణికించాడు. దీంతో భారత జట్టు చిరస్మరణీయ విజయం సొంతం చేసుకుంది.

తొలి టెస్టులో టెయిలెండర్ల సాహసోపేత బ్యాటింగ్ తో ఓటమినుంచి బయటపడ్డ ఇంగ్లీష్ జట్టు రెండో టెస్టులో మాత్రం భారత జట్టు జోరును అడ్డుకోలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కుక్ నిర్ణయాన్ని నిజం చేస్తూ ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగి తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాను కట్టడి చేశారు. దీంతో కేవలం 295 పరుగులే చేయగలిగిన భారత జట్టు ఒత్తిడిలో పడింది. భువనేశ్వర్ కుమార్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ, తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 319 పరుగులు చేసి భారత్ పై ఆధిక్యత సంపాదించింది. తొలి ఇన్నింగ్స్ గుణపాఠంతో టీమిండియా జాగ్రత్తగా ఆడి 342 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ ను ఇషాంత్ శర్మ కట్టిపడేశాడు. ఇషాంత్ విజ్రుంభణతో 223 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. 23 ఓవర్లు బౌలింగ్ చేసిన ఇషాంత్ శర్మ కేవలం 74 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టడంతో భారత జట్టు 95 పరుగుల తేడాతో విజయం సాధించింది. 28 ఏళ్ల తరువాత లార్డ్స్ లో భారత జట్టు విజయం సాధించగా, 14 టెస్టుల తరువాత టీమిండియా విదేశాల్లో విజయం సాధించింది. దీంతో టీమిండియా 1-0 ఆధిక్యం సంపాదించింది.

India-win-Lords

India-win-Lord-picth

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more