Polavaram bill in rajyasabha

Polavaram Bill in Rajyasabha, Rajnath Singh introduces Polavaram Bill in Rajyasabha, Jairam Ramesh announces support to Polavaram project

Polavaram Bill in Rajyasabha

రాజ్యసభలో పోలవరం బిల్లు!

Posted: 07/14/2014 03:02 PM IST
Polavaram bill in rajyasabha

లోక్ సభలో పాసైన పోలవరం ప్రాజెక్ట్ మీద ఆర్డినెన్స్ ను హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెట్టారు.  

దీని మీద తెలంగాణా రాష్ట్ర సమతి నాయకుడు కె కేశవరావు అభ్యంతరాలు తెలపటంతో దీని మీద చర్చ ప్రారంభమైంది.  ఈ ఆర్డినెన్స్ లో పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపటం మీద తెలంగాణా ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.  రాష్ట్రాల ఎల్లలను రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా మార్చివేయటం సరికాదని, అది రాజ్యాంగ విరుద్ధమని వాదించిన తెలంగాణా, ఒడిశా, ఛత్తీస్ గఢ్ లోక్ సభ సభ్యుల అభ్యంతరాలను లోక్ సభ స్పీకర్ పరిగణనలోకి తీసుకోలేదు.  దాని మీద న్యాయపోరాటం చెయ్యటానికి సుప్రీం కోర్టుందని స్పీకర్ తెలియజేసారు.  

రాజ్యసభలో జరుగుతున్న చర్చలో జైరాం రమేశ్ మాట్లాడుతూ, తాను స్వయంగా ఆ ప్రాజెక్ట్ ని చూసానని, అది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అనటంలో ఎటువంటి సందేహమూ లేదని అన్నారు.  అది ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ కాబట్టి ఆ రాష్ట్రమే ముంపు ప్రాంతాలలోని ప్రజలకు పునరావాసం కల్పిస్తుందని అన్న జైరాం రమేశ్, ఇప్పటికే మొత్తం అంచనాలో 32 శాతం ఖర్చయిందని కూడా తెలియజేసారు.  

జైరాం రమేశ్ ప్రసంగాన్ని అడ్డుకోవటానికి విహెచ్, ఇతర సభ్యులు ప్రయత్నించగా రాజ్యసభ డెప్యూటీ ఛైర్మన్ కురియన్ పరిస్థితిని చక్కదిద్ది చర్చను కొనసాగేట్టుగా చేసారు.   చివరగా జైరాం రమేష్ పోలవరం ప్రాజెక్ట్ కి పూర్తి మద్దతుని తెలియజేసారు.  కేవలం ముంపు ప్రాంతాలకు న్యాయం చెయ్యటం కోసం మాత్రమే వాటిని ఆంధ్రప్రదేశ్ లో కలపటం జరిగిందని, ఈ నిర్ణయం గత ప్రభుత్వం తీసుకున్నదేనని తెలియజేస్తూ, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చేసిన ప్రకటనను చదివి వినిపించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more