Telangana government releasing go on fees reimbursement scheme

Telangana government releasing GO on fees reimbursement scheme, kcr latest news, cm kcr news, cm kcr latest news, cm kcr decision on fees reimbursement, telangana governmenet releasing go on fees reimbursement, fees reimursement issue in telangana

Telangana government releasing GO on fees reimbursement scheme

సీమాంధ్ర విద్యార్థులు తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే!

Posted: 07/11/2014 02:31 PM IST
Telangana government releasing go on fees reimbursement scheme

(Image source from: Telangana government releasing GO on fees reimbursement scheme)

ఫీజు రీయింబర్స్ మెంట్ విషయం మీద తెలంగాణ రాష్ట్రం తీసుకున్న నిర్ణయం పెద్ద దుమారమే రేపింది. కేవలం ప్రాంతీయతత్వ భావంతో కేసీఆర్ విద్యార్థుల జీవితాన్ని నాశనం చేస్తున్నారంటూ... చాలామంది రాజకీయ నేతలు విమర్శించారు. ఇంకా విమర్శిస్తూనే వున్నారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం పట్టువదలకుండా తన పని తాను చేసుకుపోతున్నట్లు కనిపిస్తోంది.

1956 కంటే ముందు తెలంగాణాలో నివసించిన వారి కుటుంబసభ్యులకు మాత్రమే ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తించేటట్లు నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం... ఇప్పుడా విషయాన్ని నిజం చేస్తున్నట్టు దిశగా పావులు కదుపుతున్నట్టు సమాచారం! ఈమేరకు ఓ జీవోను తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయం మీద మండిపడిన ఆంధప్రదేశ్ ప్రభుత్వంతోపాటు తెలంగాణాలో వుండే మేధావి వర్గాలు కూడా... కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకోవాల్సిందిగా కోరారు.

ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గురువారం శాసనమండలిలో సమావేశంలో మాట్లాడుతూ... ‘‘1956 కంటే ముందు తెలంగాణాలో వున్నవారికి మాత్రమే స్థానికత వర్తిస్తుందని టీఆర్ఎస్ సర్కార్ ఇస్తున్న నిర్వచనం ఏ విధంగానూ చెల్లదని’’ ఆయన అన్నారు. హైదరాబాద్ లో వున్న విద్యార్థులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు నాన్ లోకల్ అభ్యర్థులుగా వున్నారని... అటువంటివారిని తెలంగాణ ప్రభుత్వం కూడా నాన్ లోకల్ గా గుర్తిస్తే... వారి జీవితం నాశనమవుతుందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయం మీద కేసీఆర్ ఖచ్చితంగా తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందేనని ఆయన సూచించారు.

కానీ కేసీఆర్ మాత్రం ఈ విషయంలో అస్సలు వెనక్కు తగ్గేది లేదంటూ ముందుకు దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన విషయాల మీద ఆయన పార్టీ నేతలతో చర్చలు చేసి, జీవోను జారీ చేశ దిశగా ముందుకు వెళుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్ర ప్రభుత్వం... తెలంగాణ ప్రభుత్వం జీవోను జారీ చేస్తే... దానిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉత్తర్వులను అడ్డుకునే దిశగా ఆలోచిస్తోంది. తెలంగాణ సర్కార్ తీసుకునే ఈ నిర్ణయం వల్ల గత కొన్నాళ్లుగా హైదరాబాద్ స్థిరనివాసం ఏర్పరుచుకున్న వాళ్లందరికీ, చదువుకుంటున్న విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more