(Image source from: kcr following chandrababu naidu)
‘‘నువ్వా - నేనా’’ అని ఎప్పుడూ మాటల తూటాలతో తిట్టుకునే ఆంధ్ర, తెలంగాణ మంత్రుల్లో ఈ మధ్య కొంచెం మార్పు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. మొన్నటికి మొన్న చంద్రబాబు నీటి విషయంపై కేసీఆర్ కు లేఖ రాస్తానని ప్రకటించిన ఆయన... ఇప్పుడు తాజాగా కేసీఆర్ కూడా బాబు బాటలోనే నడుస్తున్నట్టు కనిపిస్తోంది. రుణాల రీషెడ్యూల్ కు ఆర్బీఐ వ్యతిరేకించిన నేపథ్యంలో బాబు, కేసీఆర్ లకు నిద్రలేకుండా టెన్షన్ పట్టుకుంది. అయితే బాబు మాత్రం వెనక్కు తగ్గకుండా రుణమాఫీ రీషెడ్యూల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.
రైతుల రుణమాఫీల విషయంలో ఇటు తెలంగాణా, అటు ఆంధ్రా ముఖ్యమంత్రుల్లో నెలకొన్ని టెన్షన్ అంతా ఇంతా కాదు. చంద్రబాబు నాయుడు అయితే ఎడతెరపి లేకుండా ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. ఎంత ఇబ్బంది అయినా ఫర్వాలేదు... రైతు రుణాలను మాఫీ చేయడం కోసం కూలీపనివాడిలాగా పనిచేస్తానని పేర్కొన్న బాబు... అన్న మాట ప్రకారం కష్టపడుతూనే వున్నారు. చివరకు ఈయన కష్టానికి ఫలితం దక్కినట్లుగా కనిపిస్తోంది. బాబు చేస్తున్న ప్రయత్నాల ఫలితంగా ఆర్బీఐ రీషెడ్యూల్ కు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి అయిన అజేయకల్లం రైతురుణాల వివరాలతో ఆర్బీఐ వద్దకు వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ కు ఊరట లభించింనట్లు తెలుస్తోంది. చంద్రబాబు సర్కారు రుణమాపీపై చేస్తున్న కసరత్తు పూర్తయ్యేంతవరకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు. ‘‘వారు చేస్తున్న పనిని చేయనివ్వండి. ఆర్బీఐ వాళ్లకు ఎలాంటి వెసులుబాటు కల్పిస్తే.. దానికోసం మనం కూడా పట్టపడదాం’’ అన్న ధోరణితో కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.
నిజానికి ఇక్కడ రైతు రుణభారం ఎక్కువగా వున్న చంద్రబాబు నాయుడుకే. కేసీఆర్ కు రుణభారం చాలా తక్కువ. పైగా ఆయన కేవలం లక్ష రూపాయల వరకే మాఫీ హామీ ఇచ్చారు. దీంతో పదేపదే ఆర్బీఐ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని భావించిన కేసీఆర్... బాబు చేస్తున్న కసరత్తు అనంతరం తమకు కూడా అటువంటి ఫలితాన్ని కల్పించాల్సిందిగా కరితే బాగుంటుందని చెప్పినట్లు రాజకీయవర్గాలు చెప్పుకుంటున్నారు. అంటే.. ‘‘కేసీఆర్, చంద్రబాబు బాటలో నడుస్తున్నారన్నమాట!’’ అని అందరూ చర్చించుకుంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more