ఐధేళ్ల పాటు అధికారంలో వున్న నేతలు ప్రతిపక్షంలోకి వచ్చినా.. లేక ఓటమిని చవిచూసినా.. అప్పటి వరకు తాము చేపట్టిన అధికార, అనధికార పనులను సక్రమంగా పూర్తి చేసుకోవాలంటే గోపీలుగా మారాల్సిందే. ఇది రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య, అదే విధానాన్ని తాజాగా అన్వయించనున్నారు టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, అలియాస్ ఉమామహేశ్వరరావు.
టీడీపీలో ముఖ్యభూమిక పోషించిన ఆయనకు సీనియారిటీ లేనికారణంగా కొద్దిలో మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి మిస్ అయ్యింది కానీ, లేని పక్షంలో ఆయన టీడీపీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారని మనం చెప్పుకునేవాళ్లం. అలాంటి బోండా ఉమ టీడీపీ పార్టీకి గుడ్బై చెప్పి వైసీపీలో చేరబోతున్నారా? ప్రస్తుతం విజయవాడ రాజకీయాల్లో ఇదే పెద్ద హాట్ టాపిక్ అయింది. త్వరలోనే ఆయన వైసీపీ తీర్థ పుచ్చుకోనున్నారని విజయవాడలో ప్రచారం జోరందుకుంది.
విజయవాడ సెంట్రల్ సీటు నుంచి టీడీపీ నుంచి బరిలోకి దిగిన ఆయన వైసీపీ నేత మల్లాది విష్ణు చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే బొండా ఉమా తమ పార్టీలోకి వస్తే విజయవాడ సెంట్రల్ కు బదులుగా తూర్పు నియోజకవర్గం బాధ్యతలను అప్పగిస్తామని వైసీపీ ప్రతిపాదన తెచ్చినట్టు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీలో కొనసాగుతూ అప్పటి వరకు తన అనధికార పనులను కూడా అధికార దన్నుతో చక్కబెట్టుకోవచ్చునని బొండా కూడా ఉవ్విళ్లూరుతున్నట్లు సమాచారం.
అయితే తూర్పు సెగ్మెంట్ లో వున్న అసలు కిటుకుపైనే ఆయన తీవ్రంగా అలోచిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి పనిచేసిన బొప్పన భవకుమార్, ఎన్నికలకు ముందు ఇదే నియోజకవర్గానికి ఇన్ చార్జీగా వ్యవహరించిన యలమంచిలి రవి తదితరులు సీనియర్లు కావడంతో తనకు వారి నుంచి సహకారం ఉండకపోవచ్చని బోండా ఉమ భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం బోండా ఉమ ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఐదో తేదీన ఆయన తిరిగి విజయవాడ రానున్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరిక విషయమై నిర్ణయం తీసుకుంటారని సన్నిహితులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more