కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలపై మళ్లీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తనను ఈ విషయంలో నిలదీస్తున్న కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై అమె తనదైన స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఒక సామాన్య మహిళకు కాంగ్రెస్ అధ్యక్షుడిపై పోటీ చేసే సత్తా, అతడిపై విజయం సాధించే సత్తా వుందని అమె అత్యంత చాకచక్యంగా, రాజకీయ పరిణితితో వాటిని ఎదుర్కోగలిదింది. తనపై వారి చేతికి చిక్కే ఏ ఒక్క అంశాన్ని కూడా కాంగ్రెస్ నేతలు చేజార్చుకోకుండా విమర్శలు అరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టింది.
రాహుల్ గాంధీపై తాను పోటీ చేయడం ఇష్టం లేకనే వారు ఇలాంటి అరోపణలు చేస్తున్నారని కూడా అమె అరోపించారు. అయితే కాంగ్రెస్ నేతల విమర్శలను, అరోపణలను తాను సమర్థవంతంగా ఎదుర్కోంటానని అన్నారు. ఇంతవరకు బాగానే వున్నా ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేసిన క్రమంలో అమె తాను డిగ్రీ పట్టా పుచ్చుకున్నానని చెప్పారు. అది నిజమా.? కాదా.? అంటే కాదన్న సమాధానాలే వినిపిస్తున్నాయి.
ఎందుకంటే అమె తాజాగా అమేధీ లోక్ సభ నుంచి బీజేపి అభ్యర్థిగా బరిలో దిగుతూ దాఖలు చేసిన నామినేషన్ లో తాను డిగ్రీ పట్టాను తీసుకోలేదని అమె స్పష్టం చేశారు. తాను పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణురాలయ్యానని అయితే ఆ తరువాత కళాశాలకు వెళ్లి విద్యాబాసం చేయడం కష్టంగా మారి.. తాను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి దూరవిధ్య ద్వారా డిగ్రీ తొలి సంవత్సరం చదివానని ఆ తరువాత దానిని కూడా వదిలేశానని అమె తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్ లో వివరాలు పోందుపర్చారు.
అయితే 2004 నామినేషన్ పత్రాలలో డిగ్రీ పూర్తయినట్లుగా స్మృతి వెల్లడించారు. ఆ తరువాత ఇదే అంశం అమె కేంద్ర మానవ వనరులు శాఖ మంత్రిగా బాధ్యతలు చేప్పటినప్పుడు కూడా అమె విద్యార్హతలు విషయమై తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలోనూ అమె తాను డిగ్రీ పూర్తిచేసినట్లుగా చెప్పుకోచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సమర్పించిన అఫిడవిట్ లో మాత్రం డిగ్రీ డిస్కంటిన్యూ అని పేర్కొన్నారు. 1991లో ఆల్ ఇండియన్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్(పదో తరగతి), 1993లో ఆల్ ఇండియన్ సీనియర్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్(ఇంటర్) పాస్ అయినట్లుగా ఆమె వెల్లడించారు.
2004 ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడెవిట్ ప్రకారం స్మృతి ఇరానీ 1996లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందినట్టు పేర్కొన్నారు. కానీ తాజా అఫిడవిట్ లో మాత్రం తాను బీకామ్ డిస్కంటిన్యూ చేశానని వివరాలు పోందుపర్చారు. ఇక 2014 ఆగస్టులో జరిగిన ఓ మీడియా సమావేశంలో స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. యూఎస్లోని ప్రతిష్టాత్మక యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందినట్లు చెప్పారు. అమె పలు సందర్భాల్లో పలు వివరాలను తెలిపి.. వాటిలో నిజానిజాలు ఏంటన్న వివరాలు మాత్రం తెలియకుండా గోప్యంగా వుంచుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీనో లేక మరే విపక్షమో కాదు.. అసలు అమో ఎం చదివారన్న విషయంలో అమెకే క్లారిటీ లేకపోతే..ఎలా.. ప్రజలకు వివరాలు తెలియకపోతే ఎలా అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more