తెలంగాణలో డిసెంబర్ నెల 7వ తేదీన జరగనున్న ఎన్నికలలో ప్రజాతీర్పు ఎలా వుండబోతుంది.. ఎవరు గెలుస్తారు.. 11న వెల్లడి కానున్న ఓటరు తీర్పు ఎవరికి అధికార పగ్గాలను చేర్చుతుందన్న అన్న విషయాలపైనే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్ననాటి నుంచి అధికార పార్టీలు తమకు తలవంచక తప్పదని.. ఇప్పుడు రాబోయే ఎన్నికలలో విజయం ఎవరిని వరించినా తమ ముందు తగ్గల్సిందేనని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.
అది చాలదన్నట్లు రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే.. ప్రభుత్వ పగ్గాలు ( కారు స్టీరింగ్) మాత్రం తమ చేతుల్లోనే వుంటాయని ఏకంగా ఆల ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా వ్యాఖ్యానించారు. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వేసే ఓటు అనధికారికంగా ఎంఐఎంకు వెళ్తుందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. దీంతో తాము చేసిన తప్పును దిద్దుకునే పనిలో పడిన ఎంఐఎం.. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.
ఈ రెండు పార్టీల మధ్య మిత్రృత్వ పోటీ వున్నా.. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవాలని, ప్రచారం చేసి.. వారిని గెలిపించాలని తమ అభ్యర్థులు లేని చోట కూడా ఓటర్లను సభలు, సమావేశాలు, రోడ్ షోల ద్వారా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇక దిద్దుబాటు చర్యల్లో భాగంగా తాజాగా ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైపీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ ఎన్నికలలో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాదు అందుకు తమ మద్దతు కూడా కేసీఆర్ ప్రభుత్వానికి అవసరం వుండదని వెల్లడించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మరో రాజకీయ వేదిక ఏర్పడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం పరిస్థితి దేశమంతా రావాలని ఆకాంక్షించారు. అయితే చంద్రబాబు, ఆ తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తరువాత చంద్రశేఖర్ రావు ప్రభుత్వాలతో జతకట్టి నడిచిన ఎంఐఎం.. ఎన్నికల నేపథ్యంలో మాత్రం తమ పార్టీ గెలుపు మినహా ప్రచారం చేయదు.
కానీ ఈ సారి ఇలా ప్రచారం చేయడంతో పాటు టీఆర్ఎస్ మళ్లి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేయడం అధికార పార్టీకి మోకరిల్లడమే అంటూ పార్టీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఒకలా ఇప్పుడు మరో ధోరణితో ఎంఐఎం పార్టీ వుందని ఊహాగానాలు కూడా వినబడుతున్నాయి. అయితే టీఆర్ఎస్ పార్టీ కొంత బలహీనంగా మారింది కాబట్టే తెరపైన ఎంఐఎం పార్టీ మద్దతు తెర వెనుక బీజేపి మద్దతు తీసుకుని ఎన్నికల బరిలో నిలుస్తుందన్న వార్తలు కూడా వినబడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more