కాంగ్రెస్ పార్టలో చేరిన రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి చేశారా..? లేదా..? చేశానని ఆయన స్వయంగా టీడీపీ జాతీయ అద్యక్షుడు చంద్రబాబు పీఏకు సమర్పించిన లేఖలో స్పష్టం చేసినా.. ఇంకా ఈ విషయంలో మాత్రం సస్పెన్స్ కోనసాగుతుంది. అసలు ఆయన స్పీకర్ మదుసూధనా చారీకి తన రాజీనామా లేఖను పంపారా..? లేదా..? అన్న విషయం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇదే క్రమంలో ఆయన చంద్రబాబుతో మైండ్ గేమ్ అడుతున్నారా..? అన్న సందేహాలు కూడా తెరపైకి వస్తున్నాయి.
ముక్కుసూటిగా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లేడే రేవంత్ రెడ్డి.. ముందొరకంగా, వెనకోరకంగా చేసే నేత మాత్రం కాదన్న విషయం తెలిసిందే. అయితే తాను ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశానని ఆయన ప్రకటించినా.. ఆయన రిజైన్ లేటర్ ను ఇప్పటివరకు స్పీకర్ కు ఎందుకు పంపలేదన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. చంద్రబాబు ఫీఏకే పార్టీ సహా పదవికి సంబంధించిన రాజీనామా లేఖలు వున్నాయా..? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి చేసిన రాజీనామాపై చర్చ జరుగుతోంది. టీడీపీ పదవులతో పాటు, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున గెలిచిన ఆయన తన శాసనసభ సభ్యత్వం రాజీనామా లేఖను కూడా చంద్రబాబుకే సమర్పించినట్లు సమాచారం. కాగా, ఈ రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు పంపాలని.. చంద్రబాబుకు చెప్పినట్లు రేవంత్ తన సన్నిహితులకు చెప్పారు. ఇప్పటివరకు అసెంబ్లీకి గానీ, స్పీకర్ కార్యాలయానికి కానీ రేవంత్ రాజీనామా చేరకపోవడంతో రేవంత్ రాజీనామా విషయంలో క్లారిటీగా వున్నారా..? అన్న అనుమానాలకు తావిస్తుంది..
గతంలో కొందరు ఎమ్మెల్యేలు.. టీఆర్ఎస్ లో చేరినపుడు.. పదవులకు రాజీనామా చేయాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేశారు. కానీ రేవంత్ రాజీనామాపై మాత్రం టీడీపీ లీడర్లు స్పందించటం లేదు. పైగా రాజీనామా లేఖను చంద్రబాబు.. స్పీకర్ కు పంపుతారా అన్న ప్రశ్నకు ఘాటుగా స్పందిస్తున్నారు. ఆయన రాజీనామాను స్పీకర్ కు పంపడానికి.. చంద్రబాబు పోస్ట్ మెన్ లా కనిపిస్తున్నారా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.
జరుగుతున్న పరిణామాలు చూస్తే.. రేవంత్ రెడ్డి ఉప ఎన్నికను కోరుకోవటం లేదా అన్న చర్చ ఓ వైపు జరుగుతుండగానే మరోవైపు మాత్రం చంద్రబాబును ఏ నిర్ణయం తీసుకున్నా.. దాంతోనే అతనికి చెక్ పెట్టేలా రేవంత్ అడుగులు వేస్తారా... అన్నది అర్థం కాని ప్రశ్న. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అధికార పార్టీలో చేర్చకున్నప్పుడు వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకోని చంద్రబాబు.. ఇప్పుడెలాంటి చర్యలకు ఉపక్రమిస్తారన్నది తెలుసుకునేందుకు కూడా రేవంత్ ఇలా చేశారన్నవార్తలు వినిపిస్తున్నాయి. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఏపీలో కూడా రేవంత్ చేత ప్రచారం చేయించే అవకాశాలను కాంగ్రెస్ పరిశీలిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more