Chandrababu Fire on Payyavula over meet with KCR | ఇంతకీ పయ్యావుల చేసిందాంట్లో తప్పేముంది?

Chandrababu class to payyavula

Payyavula Keshav, TDP Chief Chandrababu Naidu, Paritala Sriram Wedding, Chief Minister KCR, KCR Payyavula Chandrababu, TTDP Payyavula Keshav Chandrababu

TDP Chief Chandrababu Naidu Fire on Senior Leader Payyavula Keshav over personal Meet with KCR in Paritala Sriram Wedding. TTDP Leaders Angry with Payyavula's Attitude and complaint at Chandrababu.

కేసీఆర్ తో ఏకాంత భేటీపై పయ్యావులకు క్లాస్?

Posted: 10/11/2017 10:18 AM IST
Chandrababu class to payyavula

ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహం జరిగిన వేళ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైన విషయం తెలిసిందే. ఆపై టీడీపీ సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న పయ్యావుల కేశవ్ ఏకాంతంగా మాట్లాడటం వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో చంద్రబాబు టీటీడీపీ నేతలతో సమావేశమైన వేళ, రేవంత్ తదితరులు ఈ విషయాన్ని ప్రస్తావించి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పయ్యావుల వైఖరిని చంద్రబాబు తప్పుబట్టినట్లు సమాచారం.

తాజాగా జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ... "తెలంగాణలోనూ తెలుగుదేశం పార్టీ ఉంది. అక్కడి వాళ్ల మనోభావాలను మనం గౌరవించాలి. నేను, కేసీఆర్ కూడా కలుసుకున్నాం. ఒకచోట ఎదురుగా వచ్చి, రెండు నిమిషాలు మాట్లాడుకున్నాం. ఆపై ఎవరిదారిన వాళ్లం వెళ్లిపోయాం. కానీ మన మంత్రులు, నేతలు పరిధులు దాటి ఆయనతో దగ్గరగా మెసిలారు" అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు.

దీనిపై తెలంగాణ పార్టీ నేతలు తనవద్ద అభ్యంతరాలను వ్యక్తం చేశారని అంటూ, "పయ్యావుల సీనియర్. ఆయనకు కేసీఆర్ తో ఏకాంత సమావేశాలు ఎందుకు? ఏం సందర్భం ఉంది? పెద్ద నేతలు కూడా ఇలా చేస్తే ఎలా? తెలంగాణలో రాజీనామాలు చేసి వెళతామంటున్నారు" అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో పయ్యావుల కేశవ్, మనస్తాపానికి గురయ్యారు.

పయ్యావుల ఏమన్నారు?

ఈ విషయంలో చంద్రబాబుకు అవాస్తవాలు చెప్పారు. అందువల్లే నేను మాటలు పడాల్సి వచ్చిందని ఇతర టీడీపీ నేతల వద్ద ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. జరిగిన ఘటనలో తన తప్పేముందని ప్రశ్నించిన ఆయన, పరిటాల ఇంట పెళ్లికి అందరిలాగానే తాను కూడా ఓ అతిథిగా వచ్చానని చెప్పారు. కేసీఆర్ కనిపిస్తే, ఓ నమస్కారం పెట్టి వెళ్లిపోయానని, ఆ వెంటనే తనతో వచ్చిన ఓ ఉన్నతాధికారిని ఆయన పంపి తనను పిలిపించగా, వెళ్లకుంటే బాగుండదన్న ఉద్దేశంతో కేసీఆర్ దగ్గరికి వెళ్లానని చెప్పారు.

ఆయనే(కేసీఆర్) తన చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకెళ్లి మాట్లాడారని గుర్తు చేశారు. తానేమీ స్వయంగా వెళ్లి ఏకాంత భేటీలు జరపలేదని అన్నారు. చెయ్యని తప్పుకు మాటపడటం బాధను కలిగించిందని వాపోయారు. ఈ తరహా వైఖరులు సరికావని.. ఇలాంటి పరిస్థితి కొనసాగితే పార్టీకి రాజీనామా చేయడం మినహా మరో మార్గం తమ ముందు ఉండబోదని టీటీడీపీ నేతలు చంద్రబాబుతో తేల్చిచెప్పినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles