ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారా..? రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీపై అవాక్కులు, చెవాక్కులు పేల్చి.. సమైక్యాంధ్ర పార్టీ పెట్టిన చేతులు కాల్చుకున్న మాజీ ముఖ్యమంత్రి మళ్లీ కాంగ్రెస్ ను గట్టెక్కించేందుకు చర్యలు తీసుకుంటున్నారా..? ఆయనైతేనే నవ్యాంద్రలో కాంగ్రెస్ పార్టీ గాడిన పడుతుందని అగ్రనాయకత్వం భావిస్తుందా..? ఈ మేరకు నవ్యాంద్ర పగ్గాలను ఆయనే అందుకోబోతున్నారా.? ఈ మేరకు తెర వెనుక ప్రయత్నాలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయా.. అంటే అవునన్న సమాధానాలే వినబడుతున్నాయి.
ఢిల్లీలోని ఏఐసీసీ నేతలతో కిరణ్ కుమార్ రెడ్డి మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ విషయమై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశమున్నట్టు సమాచారం. అయితే మాజీ ముఖ్యమంత్రిగా వున్న కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ రాజకీయ పునరాగమనం చేస్తారని ఇప్పటికే పలు పత్రికలలో వార్తలు వచ్చాయి. అయితే కేంద్రంలో అధికారంలో వున్న బీజేపి పార్టీ వైపు ఆయన చూస్తున్నారన్న వార్తలు ప్రముఖంగా వినిపించాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో తన మాటను పెడచెవిన పెట్టి మరీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సందర్భంగా ఆయన అప్పట్లో ఏకంగా అధినేత్రి సోనియాగాంధీతో పాటు యువనేత రాహుల్ గాంధీని కూడా విమర్శించారు.
ఈ నేపథ్యంలో ఆయన జాతీయ పార్టీ వైపు మాత్రమే అకర్షితులవుతున్నారని అయితే బీజేపి కండువా కప్పుకునేందుకు రమారమి సిద్దమయ్యారని కూడా వార్తలు వినిపించాయి. కానీ చివరి నిమిషంలో ఎందుకనో కాషాయ కండువా కప్పుకునేందుకు అయిష్టత వ్యక్తం చేసిన ఆయన.. మళ్లీ తనకు రాజకీయ ఉన్నతిని ప్రసాదించిన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేందుకు సిద్దమయ్యారని తెలుస్తుంది. ఇక కిరణ్ కుమార్ రెడ్డి పునరాగమనంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టాలని అధిష్టానం భావిస్తుంది.
ఇందుకోసం ఆయన కీలక భాద్యతలను అందజేయాలని కూడా యోచిస్తుందని సమాచారం. ఈ మేరకు ఆయనకు పిసీసీ పగ్గాలను కూడా ఇవ్వాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తుంది. సౌమ్యుడు, మృదుస్వభావి అయిన రఘువీరారెడ్డి పార్టీ పగ్గాలను అందుకున్నా.. ఆయనకు పార్టీ నేతల నుంచి ఆశించినంత మద్దతు లభించడం లేదని కూడా అధిష్టానం గహ్రించింది. మరి కిరణ్ కుమార్ కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఎప్పుడిస్తారో.. ఎలా గాడిన పెడతారో అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more