వరుసగా రెండు దారుణ ఓటములతో 2019 ఎన్నికలపై ఇప్పటి నుంచే ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. అయితే పార్టీ అధినేత వైఎస్ జగనోహ్మన్ రెడ్డి మాత్రం కేడర్ లో మనోధైర్యం నింపే యత్నం చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఓ టీవీ ఛానెల్ డిబెట్ నుంచి మొదలైన ఓ వార్త ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
నంద్యాల ఉపఎన్నికలు, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల ఫలితం దెబ్బతో పార్టీని పటిష్టం చేసేందుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ కొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు వ్యూహాలను సూచించాలని ఇటీవల తమ పార్టీ రాజకీయ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ని కోరినట్లు సమాచారం. అందుకు తగ్గట్లే ప్రశాంత్ కూడా ఓ సలహా ఇచ్చినట్లు కథనాలు చెబుతున్నాయి. అందులో భాగంగా త్వరలో తమ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ల మద్దతు కోరనున్నట్లు చెబుతున్నారు.
ఓవైపు జనసేనవతో వచ్చే ఎన్నికల్లో పరిమిత స్థానాల్లో పోటీ చేయనున్న పవన్.. కాంగ్రెస్ లో పెద్దగా ప్రభావం చూపకపోయినా.. కాపు నేతల లిస్ట్ లో ప్రముఖంగా చిరంజీవి సాయం కోరటం ద్వారా వచ్చే ఎన్నికల్లో టీడీపీని ధీటుగా ఎదుర్కొవచ్చనే ప్రశాంత్ జగన్ కు సూచించినట్లు చెబుతున్నారు. అయితే రాజకీయాల్లో విభిన్న ధృవాలుగా ఉన్న చిరు-పవన్ లు జగన్ కోసం ఏకమవుతారన్న వార్త హుళక్కే అని చెప్పుకోవాలి. కాపు రిజర్వేషన్ల అంశంలో కూడా వీరిద్దరు బయటి నుంచి మద్ధతు ఇచ్చే అవకాశం ఉన్నా.. కలయిక మాత్రం జరగకపోవచ్చనే విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పార్టీకార్యకర్తలతో సమావేశం ఏర్పరచి విస్తృత స్థాయిలో ప్రచారంపై అవగాహన కల్పించే అంశం మాత్రం కొట్టిపారేయలేమని వారంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more