ఏపీ రాజకీయాల్లో మరో కీలక మార్పు చోటుచేసుకోబోతుందా? జగన్ పాదయాత్ర నేపథ్యంలో అంతకంటే పవర్ ఫుల్ ఆయుధాన్నే పవన్ వాడబోతున్నాడా? 2019 ఎన్నికల్లో జనసేన గెలుపు కోసం రంగంలోకి దిగబోతున్నాడా? అవుననే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. అందుకోసం రథయాత్ర చేయబోతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.
పార్టీ విస్తరణతోపాటు, ప్రచారాన్ని ఒకేసారి మొదలు పెట్టే యోచనలో పవన్ ఉన్నట్టు చెబుతున్నారు. సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు, అదే తేదీన అనంతపురం నుంచి రథయాత్రను ప్రారంభించనున్నట్టు సమాచారం. ఇంతకు ముందు కేవలం ఏపీ వరకే దృష్టిసారించిన పవన్, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజల వద్దకు ప్రత్యక్షంగా వెళ్లి వారి సమస్యల గురించి తెలుసుకునే ఉద్దేశ్యంలో ఉన్నాడు. ఇంతకు ముందు జనసేన సభల్లో, పార్టీ అంతర్గత మీటింగ్ లలో పవన్ చాలాసార్లే ఈ విషయం చెప్పాడు కూడా.
ఇక రథయాత్ర లో కూడా ఏపీ ప్రత్యేక హోదా సాధన అంశాన్నే ప్రధాన ఆయుధంగా చేసుకుని పార్టీలపై విరుచుపడే ఛాన్స్ ఉంది. ఓవైపు వైఎస్సార్సీపీ అధినేత జగన్ పాదయాత్ర అక్టోబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. గతంలో పవన్ కూడా తాను పాదయాత్ర చేస్తానంటూ ఓ ప్రకటన చేశాడు. ఈ నేపథ్యంలో జగన్ అడ్వాన్స్ అయిపోయాడు. మరోవైపు టీడీపీ ఇంటింటికి పాదయాత్ర పేరుతో సీన్ లోకి వచ్చేసింది. దీంతో పవన్ వేరే పంథాలో ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు అర్థమౌతోంది. ఆ లెక్కన అందరికంటే ముందు ఎన్నికల ప్రచారాన్ని పవనే ప్రారంభించినట్లయ్యి ప్రజల దృష్టిలో పడుతుంది. అయితే వైసీపీ, టీడీపీలు వ్యూహాలకు పదును పెడుతున్న క్రమంలో పవన్ ఒరవడి ప్రజలను ఏమేర ఆకట్టుకుంటుందనే ఆసక్తిగా మారింది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more