తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులైన ఇద్దరు చంద్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అంశం అసెంబ్లీ స్తానాల పెంపు. ఇది జరిగితే తప్ప తమ నాయకులతో పాటు.. ఇతర పార్టీల నుంచి గెలిచి తమ పార్టీలోకి వలస వచ్చిన నేతలకు కూడా న్యాయం చేయలేమని.. ఇద్దరు చంద్రులకు అంతర్గతంగా మదనపడుతున్నారు. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల బీజేపి నేతలు మాత్రం అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచితే.. పార్టీకి కలిసోచ్చే అంశాలు మాత్రం కనిపించడం లేదని, తమ పార్టీ రెండు రాష్ట్రాల్లో పూర్తిగా పుంచజుకునే వరకు అంటే మరో ఐదేళ్ల వరకు ఈ అంశాన్ని నాన్చాలని ఆ తరువాత ఈ విషయమై చర్యలు తీసుకుంటే అప్పటి వరకు పార్టీని బలోపేతం దిశగా చేస్తామని అడ్డుపుల్లులు వేస్తున్నారని సమాచారం.
రాష్ట్ర పునర్విభజన బిల్లులో యూపీఏ ప్రభుత్వం రెండు రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాలను పెంచాలని స్పష్టంగా పేర్కోన్న నేపథ్యంలో దానిని అమలు చేయాలని ఇద్దరు చంద్రులు అధికారంలోకి వచ్చిన నాటి నుచి కేంద్రాన్ని కోరుతున్నారు. అయితే అది నుంచి కాదు.. కూడదు.. అంటూ వచ్చిన కేంద్రం ఇద్దరు ముఖ్యమంత్రులు కోరుతున్న నేపథ్యంలో అ దిశగా అడుగులు వేసింది. అసెంబ్లీ సీట్ల పెంపుపై విస్తృతంగా అధ్యయనం చేసిన కేంద్ర హోంశాఖ ఇందుకు పచ్చజెండా ఊపింది. రాజ్యాంగంలోని 170వ అధికరణంలోని మూడవ సబ్ క్లాజ్ కు స్వల్ప సవరణలు చేయడం ద్వారా వీలు కల్పించవచ్చని అభిప్రాయపడింది. దీంతో ఈ విషయమై త్వరలోనే ప్రధాని మోడీ కూడా సమీక్షించనున్నారు.
ఈ తరుణంలో రాష్ట్రపతి ఎన్నికలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కలసి వచ్చాయి. ఎన్డీఏ అభ్యర్థిని బలపర్చేందుకు మద్దునిస్తున్న నేపథ్యంలో తాము ఎంతో అసక్తిగా ఎదురుచూస్తున్న అసెంబ్లీ సీట్ల పెంపు అంశాన్ని కూడా పరిష్కరించాలని చంద్రులు కోరడంతో అందుకు బీజేపి నాయకత్వం అంగీకరించనట్లు తెలుస్తుంది. దీంతో రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన తరువాత అసెంబ్లీ సీట్ల పెంపు అంశాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పరిష్కరిస్తారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇరురాష్ర్టాల బీజేపి నేతలను ఢిల్లీ పిలిపించి ప్రతిష్ఠంబన తొలిగిస్తారని తెలుస్తుంది. దీంతో అమిత కటాక్షం కోసం ఇద్దరు చంద్రులు నిరీక్షిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more