ప్రతిపక్ష వైఎస్సార్పీపీ బలమైన మహిళా నేతగా, ఫైర్ బ్రాండ్ గా పేరుబడ్డ రోజాకు కష్టాలు మొదలయ్యాయా? ప్రతీరోజూ మీడియాలో కనిపించాలనే ఆమె తాపత్రయం ఇరకాటంలో నెడుతుందా?. వైజాగ్ లో అవినీతి కుంభకోణంపై కీలకంగా నిర్వహించిన మహాధర్నాకు రోజా డుమ్మా కొట్టడంలో ఆంతర్యం ఏంటి? వీటన్నింటిని మేళవించి కొత్త కారణాలు అన్వేషిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ అధినేత జగన్ వార్నింగ్ ఇవ్వటంతోనే మనస్థాపం చెంది ఆమె రాలేదని చెప్పుకుంటున్నారు.
గతంలో అసెంబ్లీలో రోజా ప్రవర్తించిన తీరు వల్ల ప్రభుత్వంపై దాడి చేయడానికి అవకాశాలు లేకుండా పోయాయని మండిపడ్డ జగన్ ఇప్పుడు ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతో మరింత ఆగ్రహానికి లోనైయ్యాడంట. రోజా వ్యవహారశైలి పార్టీకే కాదు, జగన్ కు ఇబ్బందిని కలిగించాయని, ఈ నేపథ్యంలో ఆమెను పిలిపించుకుని మరీ క్లాస్ పీకారని సమాచారం. ఇంకోపక్క వైసీపీ అధికారంలోకి వస్తే, తానే హోం మంత్రిని అంటూ రోజా ప్రచారం చేస్తుందన్న వాదన ఒకటి ఉంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని తీరు మార్చుకోవాలని, లేకపోతే వేటు తప్పదని కూడా హెచ్చరించినట్టు తెలుస్తోంది.
గతంలో వేటు సమయంలోనే జగన్ ఆమె సున్నితంగా మందలించగా, ఆ మధ్య కొంత కాలం మౌనంగా ఉన్న రోజా, మళ్లీ ఇప్పుడు చెలరేగిపోతుంది. ఇదిగాక పవిత్రమైన తిరుమల కొండపై కూడా రోజా రాజకీయ విమర్శలకు దిగుతుండటం, శివసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేయటం, చివరకు పంచాయితీ జగన్ దృష్టికి చేరిందంట. అదే సమయంలో నియెజకవర్గంలో రోజా సరిగ్గా ఉండటం లేదన్న ఫిర్యాదులు కూడా అందటం జగన్ కు చికాకు తెప్పించనట్లు చెబుతున్నారు. తనకు తోచినట్లు కాకుండా పార్టీ సూచించిన విధంగా మాట్లాడాలంటూ రోజాకు జగన్ సూచించినట్టు సమాచారం. జగన్ మందలించారన్న వార్తలో నిజమెంతో తెలీదుగానీ, ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమానికి రాకపోవడం వెనుక బలమైన కారణమే ఉండి ఉండవచ్చని మరికొందరు అంచనా వేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more