నా సినిమాలు చూస్తే చూడండి.. లేకపోతే పోండి. ఇది కొంత కాలం క్రితం దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓపెన్ గా చెప్పిన మాట. అతని మాటకు కట్టుబడే ప్రేక్షకులు కూడా సినిమాలను చాలా దూరం పెట్టేశారు కూడా. అయితే తన కామెంట్లతో, ట్వీట్లతో మీడియాకు సినిమా నుంచి దొరికిన ఆణిముత్యంగా వర్మ ఫీలయితే.. జర్నలిజం నుంచి దొరికిన మరో మాణిక్యం ఆర్నబ్ గోస్వామి. మీడియా రంగానికి దేవుడిచ్చిన బహుమతిగా తనకు తాను చాలా సార్లే అభివర్ణించుకున్నాడు లేండి.
తన ‘న్యూస్ అవర్’ ప్రస్థానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావటంతో ఇక లాభం లేదునకుని ఈ మధ్యే సొంతంగా రిపబ్లిక్ అనే ఛానెల్ పెట్టుకుని కానిచ్చేస్తున్నాడు. పక్కా హిందుత్వ వాదాన్ని, దేశ భక్తిని చాటుకుంటున్నాడు( అని ఆర్నబ్ ఫీలింగ్). అఫ్ కోర్స్ దీనివెనకాల బీజేపీ హస్తం ఉందన్న టాక్ కూడా ఒకటి ఉందనుకోండి. మరి పార్టీ కోసం ఏదో ఒక సాయం చేయాలిగా.. అందుకే కాషాయంపై కామెంట్లు చేసేవారిని టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేస్తున్నాడు.
ఈ మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాంతీయ రాజకీయాలనుద్దేశించి ఉత్తర, దక్షిణ భారతదేశమంటూ ట్వీట్లతో కేంద్రంపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఆర్నాబ్ పవన్ చేసిన ట్వీట్ కు రీట్వీట్ చేశాడు. పవన్ ది స్టుపిడ్ చర్య అని.. కేవలం నటుడే తప్ప, మంచి పౌరుడు కాదని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజలను విడగొట్టాలని చూస్తున్నాడంటూ ట్వీట్ పెట్టాడు. దీనికి అభిషేక్ తివారీ అనే బీజేపీ నేత రిప్లై సందేశం కూడా పెట్టాడు. ఇందులో రాజకీయ కోణం ఎంత ఉందన్నది, ఆర్నబ్ అరుపుల వెనుక ఎవరున్నారన్నది స్పష్టంగా తెలుస్తున్న క్రమంలో దీనిపై జనసేన గానీ, పవన్ గానీ స్పందించాల్సిన అవసరం లేదన్నది విశ్లేషకుల మాట.
Stupid act by @PawanKalyan ... u r d only actor not good citizen!! Shame on you... u diving ppl for personal gain!! https://t.co/fUeImFDJQj
— Arnab Goswami (@RealArnabG) May 10, 2017
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more