ఆత్మ రక్షణ.. ఆత్మ గౌరవం... రెండింటికి ఒకటే కామన్ పాయింట్ | Re organisation self-goal and Sentiment for Both states.

Two telugu states using bifurcation issue

Telangana and Andhra Pradesh, Telangana and AP, AP Reorganization Issue, Telangana Bifurcation, Reorganization Issue 2019 ELections, TRS TDP 2019 Elections, 2019 Bifurcation Issue, TRS Still Sentiment

Telangana and Andhra Pradesh states still raises the reorganization issue and continues to accuse the counterparts. When Naidu does it, it becomes a self-goal, but when it comes to TRS leaders it becomes sentiment.

విభజన రాజకీయాలతో కాలం గడిపేస్తున్నారా?

Posted: 04/18/2017 02:47 PM IST
Two telugu states using bifurcation issue

రాష్ట్ర విభజన జరిగిపోయి మూడేళ్లు గడుస్తున్నా ఇంకా ఆ వాసనలు మాత్రం రెండు రాష్ట్రాలను వీడి పోవటం లేదు. 60 ఏళ్ల పోరాట ఉద్యమంలో విజయం సాధించామని ఒకరు, కాంగ్రెస్ అన్యాయంగా విభజించిందని మరోకరు ఇలా రెండు ప్రభుత్వాలు ఇప్పటికీ దంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నాయి. పునర్వస్థీకరణ లో లోపాలున్న మాట వాస్తవమే అయినా, ఎక్కువగా నష్టపోయింది ఏపీయే అయినా, కేంద్రం మాత్రం స్వరం మార్చి సాయం విషయంలో వెనకంజ వేయటం దారుణమైన అంశమే. ఇక విభజన అనేది నాణేం అయితే టీడీపీ, టీఆర్ఎస్ రెండు పార్వ్శాలుగా మార్చుకుని మరీ వాడేసుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈ మూడేళ్లలో ఇరు రాష్ట్రాలు సాధించిన ప్రగతి మాట అటుంచి చాలా సందర్భాల్లో విభజన పదాన్ని ఉపయోగించటం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా లాభపడ్డట్లు భావిస్తున్న టీఆర్ఎస్ పార్టీ నుంచే దీనిపై ఎక్కువ ధృష్టిసారించింది. ఛాన్సు దొరికినప్పుడల్లా ఉమ్మడి ఆంధ్రాలో తీరని ద్రోహం జరిగిందని, సొంత రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపుకుందామని ఇలా చెప్పుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో వారి యవ్వారం కాస్త కామెడీగా మారుతోంది.

ఇక్కడో ఉదాహరణ చెప్పుకుందాం. రీసెంట్ గా జగిత్యాల జిల్లాలో ప్రగతి సభ జరిగింది. అక్కడ సభలో తెలంగాణకు ఉమ్మడి స్టేట్ లో జరిగిన అన్యాయాల గురించి ప్రసంగించిన నిజామాబాద్ ఎంపీ, కల్వకుంట్ల కవిత చివర్లో జై తెలంగాన అటూ నినాదాలు చేసింది. దీనికి జనాల నుంచి పెద్ద ఎత్తునే నినాదాలు వచ్చాయి. అయితే ఉద్యమ సమయంలో ప్రదర్శించిన ఆత్మగౌరవ నినాదాన్ని ఇప్పుడు స్వరాష్ట్రం, సొంత ప్రభుత్వంలో ప్రదర్శించాల్సిన అవసరం ఉందా? అని తోటి నేతలే గొణుక్కుంటున్నారు.

ఇక ఇదే సీన్ ను ఏపీకి మార్చి చూద్దాం. రాష్ట్ర విభజన అన్యాయమని, ఘోరంగా అన్యాయం చేశారని ప్రతీ మీటింగ్ లలో చంద్రబాబు ప్రసంగాలు ఇవ్వటం చూస్తుందే. కానీ, ఇక్కడే ఓ చిక్కు వచ్చి పండింది. ఆయన ఆ మాట అన్న ప్రతీసారీ మీడియాతో సహా అంతా రెండు రాష్ట్రాల్లో వైషమ్యాలు రేపటానికి బాబు ప్రయత్నిస్తున్నాడంటూ విమర్శలు వచ్చిపడుతున్నాయి. సరైన గవర్నెన్స్ లేకపోవటం అనే కారణాన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో తప్పు జరిగిన ప్రతీసారి ప్రతిపక్షాలు సులువుగా టీడీపీని టార్గెట్ చేయగలుగుతున్నాయి.

ఆ సమయంలో విభజన అనే సాకును చూపి ఏపీ సీఎం ఆత్మరక్షణ పోరాటం చేస్తుంటే.. అరిగిపోయిన సెంటిమెంట్ అనే అరిగిపోయిన సీడీ ఏస్తూ టీఆర్ఎస్ మాత్రం ఇంకా జనాలను దువ్వులనే ప్రయత్నిస్తోంది. 2019 ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఇప్పటికే ట్రయల్స్ మొదలయ్యాయి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 2019 Elections  TRS  TDP  Bifurcation Issue  

Other Articles