ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయాలు ఇంతలా దిగజారిపోయాయా..? అంటూ అవేదన, అందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో బీజేపి పార్టీపైనే విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. ప్రధాన మంత్రికి రాజకీయాలు దిగజారిపోయాయా అంటూ అవేదన వ్యక్తం చేసే నైతిక హక్కు లేదని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. మిస్టర్ క్లీన్ గా పేరోందడం కూడా తప్పు అన్నట్టుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై పార్లమెంటు సాక్షిగా ఆయన చేసిన విమర్శలు దిగజారుడు తనానికి నిదర్శనం కావా..? అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్షాలు.
ఇక ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్లో నిర్వహించిన భారీ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ రాహుల్, అఖిలేష్లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ గురించి అఖిలేష్కు పూర్తిగా తెలియదని, 1984లో తండ్రి ములాయంపై ఆ పార్టీ హత్యాయత్నానికి కూడా పాల్పడిందని ఆరోపించారు. అటువంటి పార్టీతో ఇప్పుడు అఖిలేష్ పొత్తు పెట్టుకున్నారని అన్నారు. సినిమా ఫస్టాఫ్లో బద్ధ శత్రువులుగా ఉన్న రెండు పాత్రలు ఇంటర్వెల్ తర్వాత ఒక్కటయ్యారని రాహుల్-అఖిలేష్ను ఉద్దేశించి వ్యంగ్యంగా అన్నారు. తండ్రిని చంపబోయిన వారితో ఎవరైనా చెలిమి చేస్తారా? రాజకీయాలు మరింత ఇంతగా దిగజారాయా? అని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాని ఈ కామెంట్ పట్ల కూడా కాంగ్రెస్ సహా పలు పార్టీలు ప్రధానికి పలు సూచనలు చేస్తున్నాయి. ప్రధాని ఎన్నడో జరిగిన విషయాలను గుర్తు పెట్టుకోగలుగుతున్నారని, కానీ ప్రస్తుతం తన కళ్లముందు జరుగుతున్న విషయాలను మాత్రం చూడలేరని అన్నారు. జమ్మూకాశ్మీర్ లో తమ పార్టీ గెలుపుకు పాకిస్థాన్ ప్రభుత్వమే కారణమని చెప్పిన పార్టీలతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాలను నడుపుతున్న విషయమై ఆయన ఏం మాట్లాడతారో చెప్పాలని నిలదీస్తున్నారు. దేశంలోని రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు వుండరని చెబుతున్న నేతలు.. దేశానికి సంబంధించి మాత్రం ఇలాంటివి వుండవన్నారు.
కాంగ్రెసేతర పార్టీల ఏలుబడిలో గత 27 ఏళ్లుగా యూపీ సర్వనాశనం అయిందంటూ యాత్రలు చేసిన రాహుల్ ఈ 27 ఏళ్ల కాలంలో ఎక్కువకాలం రాష్ట్రాన్ని పాలించిన ఎస్పీతోనే జట్టు కట్టారని ప్రధాని అన్నారు. దీనిపై కూడా ప్రత్యర్థి పార్టీలు విమర్శలను కురిపించాయి. తమ పార్టీకి చెందిన నేతలపైనే ప్రధాని మోడీ విమర్శలను చేసిన విషయాన్ని గుర్తుచేశాయి. 70 ఏళ్లుగా జరిగిన అవినీతిని ప్రస్తావించిన ప్రధాని అందులో అరేళ్ల పాటు పాలించిన బీజేపి కురువృద్ద నేత అటల్ బిహారీ వాజ్ పాయ్ పై కూడా విమర్శలు గుప్పించారన్న విషయాన్ని నొక్కివక్కాణిస్తున్నాయి.
ప్రధాని తన కార్యలయంలో కూర్చుంటే పారిశ్రామిక వేత్తలు గుర్తుకువస్తారని, వారికోసం రైతులను సైతం ఇబ్బందులు పెడతారని విమర్శించారు. భూసంస్కరణ చట్టంలో మార్పులకు సిద్దపడిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. తనను పర్యటించడానికి విలులేకుండా వీసా కల్పించడానికి నిరాకరించిన దేశానికి చెందిన అధ్యక్షుడు వస్తే ప్రోటోకాల్ మరచి విమానాశ్రయానికి వెళ్లిన ప్రధాని చరిత్రలోనే లేరని ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శించారు. ఇక నాలుగు కోట్ల రూపాయల సూటు వేసుకున్న ప్రధానిగా కూడా మోడీ చరిత్ర పుట్లలో నిలిచారని విమర్శలు చేశారు. ఇక ఆయన రోజు మార్చుకునే దుస్తుల సంఖ్యపై కూడా ఎన్నో విమర్శలు వున్నాయన్నారు.
ప్రధానిని చేసిన దేశ ప్రజలను, వారి సంక్షేమాన్ని మర్చి విదేశాలలో ఎక్కువ కాలం గడిపిన ప్రధానిగా కూడా మోడీ ముందువరుసలో నిలుస్తారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మాత్రమే దేశప్రజలు గుర్తుకువస్తారని విమర్శించారు. మోడీ చేసిన పాత పెద్ద నోట్ల రద్దు వల్ల పేద ప్రజల అకౌంట్లలోకి డబ్బులు వరద కడతాయని అన్నారని ఎవరి అకౌంట్లోనైనా మీకు చెందని డబ్బులు వచ్చాయా..? అని ప్రశ్నిస్తున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీ చేప్పిన 15 లక్షల రూపాయలు రెండేళ్లు గడుస్తున్న ఎవరికీ అందలేదని.. అచ్చె దిన్ అయన పార్టీ కార్యకర్తలకు, నేతలకే తప్ప దేశప్రజలకు రాలేదని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పించాయి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more